ఏపీ రాజధానిపై కేంద్రం స్టాండ్.. బీజేపీ విధానం ఇదేనట!!
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్ ఫైవ్ జోన్లో ఇల్లు పట్టాల పంపిణీ కార్యక్రమం తర్వాత ఏపీలో రాజధాని అమరావతి పై మళ్లీ చర్చ కొనసాగుతుంది. అమరావతి రాజధానిని నిర్వీర్యం చేయడానికి ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేశారని ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో ఏపీ సీఎం జగన్ పై విరుచుకు పడుతున్నాయి.
ఇక ఇదే సమయంలో త్వరలోనే విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ప్రారంభమవుతుందని వైవి సుబ్బారెడ్డి లాంటి నేతలు చెప్పడం కూడా రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికరంగా మారాయి. ఈ క్రమంలో ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన దగ్గుబాటి పురందేశ్వరి ఏపీ రాజధానిపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏపీని అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందడం లేదని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందని దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. ఏపీకి కేంద్రం ఏమి చేయడం లేదని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, రాష్ట్రానికి కేంద్రం అత్యధిక ఇళ్లను కేటాయించిందని పురందేశ్వరి పేర్కొన్నారు.
అమరావతిలోని ఆర్ 5 జోన్లో పేదల ఇళ్లకు నిర్మాణం అనే అంశం కోర్టులో ఉందని పురందేశ్వరి పేర్కొన్నారు తాము పేదలు మరియు అమరావతి రైతులు ఇద్దరు పక్షం ఉన్నామని, పేదలకు ఇల్లు ఇవ్వద్దని తాము ఎక్కడా చెప్పలేదని పురందేశ్వరి పేర్కొన్నారు . అంతేకాదు రాష్ట్రంలోనే కాదు అక్కడ నిర్మాణం అవుతున్న ఇళ్లలో ప్రతి ఇంటికి 1.8లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అనే విషయాన్ని గమనించాలని దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు.
ఏపీలో ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తామని ఏపీలో వచ్చే ఎన్నికల పొత్తుల పైన అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని పురందేశ్వరి పేర్కొన్నారు. ఏది ఏమైనా రాజధాని అమరావతికి కట్టుబడి ఉన్నట్టు కేంద్రం స్టాండ్ ను చెప్పడంతో పాటు, తమ విధానం, తమ నినాదం రాజధానిగా అమరావతి నే నని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మరో మారు స్పష్టం చేశారు.
-
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications