ఏపీ రాజధానిపై పార్లమెంటులో కేంద్రం ప్రకటన-మాస్టర్ ప్లాన్ ఆమోదంపై క్లారిటీ..!
ఏపీలో వైసీపీ సర్కార్ మూడు రాజధానుల ప్రక్రియ చేపట్టి నాలుగేళ్లవుతోంది. దీనిపై సుప్రీంకోర్టులో ప్రస్తుతం కేసు పెండింగ్ లో ఉంది. ఈ తరుణంలో రాజధానుల విషయలో కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ మరో ప్రశ్న ఎదురైంది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు రాజ్యసభలో ఎంపీ జావెద్ అలీ ఖాన్ అడిగిన ప్రశ్నకు కేంద్రం స్పందించింది. ఏపీ రాజధాని విషయంలో మరో క్లారిటీ ఇచ్చింది. దీంతో ఇప్పటివరకూ సాగుతున్న చర్చలో ఇది మరో అంశంగా కనిపిస్తోంది.
ఏపీ రాజధాని అమరావతేనని కేంద్రం మరోసారి పార్లమెంటు సాక్షిగా కుండబద్దలు కొట్టేసింది. ఈ మేరకు అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ మాస్టర్ ప్లాన్ కూడా ఆమోదించినట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు దేశంలోని 28 రాష్ట్రాల రాజధానుల జాబితాను కేంద్రం విడుదల చేసింది. అందులో ఏపీ రాజధానిగా అమరావతికి స్థానం కల్పించింది. పార్లమెంటు సాక్షిగా అమరావతే ఏపీ రాజధాని అన్న కేంద్రం.. మాస్టర్ ప్లాన్ ఆమోదంపై స్పందించేందుకు సదరు ఎంపీ అడిగిన ప్రశ్నేంటో తెలుసా ?

రాజ్యసభలో ఎంపీ జావెద్ అలీఖాన్ దేశంలోని 39శాతం రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ లేదన్నది నిజమా? కాదా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఎంపీ జావెద్ అలీఖాన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ సమాధానం ఇచ్చారు. ఇందులో ఆయన రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ లేదన్న మాట అవాస్తమన్నారు. ఏపీ రాజధాని అమరావతి తో సహా 26 రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ ఉందని ఆయన తెలిపారు. త్రిపుర రాజధాని అగర్తల, నాగాలాండ్ రాజధాని కోహిమా మినహా మిగతా రాజధానుల మాస్టర్ ప్లాన్ లను ఆమోదించినట్లు వెల్లడించారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications