బాబుకు మోడీ ఊరట: 1000 కోట్ల అమరావతి ఔటర్కి ఓకే, ఏపీ 'స్మార్ట్' కసరత్తు
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి 186 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్రం సూత్రపాయ అంగీకారం తెలిపింది. రాష్ట్రంలో 800 కిలోమీటర్ల రహదారులను హైవేలుగా మార్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. వెయ్యి కోట్లతో చేపట్టే ప్రాజెక్టుకు కేంద్రం అంగీకారం తెలిపింది.
కర్నూలు మీదుగా అనంతపురం - అమరావతిని కలుపుతూ జాతీయ రహదారులు 44, 65లను అనుసంధానం చేయనుంది. కర్నూలు, కడప, అనంతపురంలను కలుపుతూ జాతీయ రహదారులు 40, 65లను అనుసంధానం చేయనుంది.
నాలుగు వరుసల రోడ్ నుంచి ఆరు, ఎనిమిది వరుసల రోడ్డులు చేయనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేస్తే పనులు ప్రారంభిస్తామని కేంద్రం తెలిపింది. వెయ్యి కోట్లతో చేపట్టే ప్రాజెక్టుకు కేంద్రం అంగీకారం తెలిపింది.

స్మార్ట్ సిటీల ఎంపికకు కసరత్తు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్మార్ట్ సిటీలుగా ఎంపికైన నగరాలకు తుది జాబితాలో చోటు కల్పించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 100 స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది.
ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ప్రతిపాదనలు పంపగా కొన్ని నగరాలను ఎంపిక చేసి ప్రకటించింది. వీటిలో ఏపీలోని విశాఖ, కాకినాడ, తిరుపతి నగరాలు చోటు దక్కించుకున్నాయి. ఈ నగరాల్లో పట్టణాభివృద్ధి శాఖ తొలి ఏడాది 20 నగరాలను ఎంపిక చేసి స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తుంది.
మొదటి విడతలో స్థానం దక్కించుకునేందుకు ఏపీలోని విశాఖ, కాకినాడ, తిరుపతి నగరాలు సమగ్రమైన ప్రతిపాదనలను రూపొందించేందుకు సిద్దమయ్యాయి. ప్రజాభిప్రాయాన్ని సేకరించడం ద్వారా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించుకోవచ్చని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అన్ని రాష్ట్రాలకు సూచించింది.

ఇందుకు అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని పట్టణ స్థానిక సంస్థలకు తెలిపింది. ఇప్పటికే కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ న్యూఢిల్లీ, హైదరాబాద్, కోలకాతాల్లో ప్రాంతీయ సమావేశాలను నిర్వహించింది. పట్టణాల్లో ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి సోషల్ నెట్వర్క్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించవచ్చునని భావిస్తున్నారు.
స్థానికంగా పత్రికలు, రేడియో, టీవీ, బల్క్ ఎస్ఎంఎస్, చిత్రాల ద్వారా సూచనలు, సలహాలు తీసుకుని స్మార్ట్ సిటీ ప్రతిపాదనలు సిద్ధం చేస్తారు.
కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ 'మై గవ్' వెబ్సైట్ ద్వారా ప్రజలతో ఆయా పట్టణ స్థానిక సంస్థలు సంప్రదించవచ్చు.ప్రాథమికంగా ఎంపికైన సిటీల ప్రతిపాదనలను డిసెంబర్ 15 లోపు కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. ఈ గడువులోగా నగర సమగ్ర అభివృద్ధి వ్యూహాలతో ప్రణాళిక సిద్దం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
-
ఈ నెల 13న పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ : ఒకేసారి రూ 6 వేలు..!! -
ఆ ఎమ్మెల్యేలపై వేటు తప్పదు - తేల్చి చెప్పిన సీఎం చంద్రబాబు..!! -
అమరావతి వేదికగా అరుదైన నిర్మాణం, తెలుగు వైభవాన్ని చాటేలా..!! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!!












Click it and Unblock the Notifications