Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వాటర్ వార్ పై జగన్ సర్కార్ కు ఊరట- లోక్ సభలో కేంద్రం సమర్ధన- అందుకే గెజిట్

ఏపీ-తెలంగాణ మధ్య సాగుతున్న వాటర్ వార్ పై కేంద్రం ఇవాళ లోక్ సభలో స్పందించింది. లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు, కృష్ణా జలాల అంశం, పోలవరం నిధులపై చర్చకు వైసీపీ ఎంపీలు పట్టుబట్టారు. ఓ దశలో వెల్ లోకి దూసుకెళ్ళి నిరసన తెలియజేశారు. దీంతో స్పందించిన జల్ శక్తి మంత్రి సమాధానం ఇఛ్చారు.

శ్రీశైలంలో 800 అడుగల మట్టంలోనే నీటిని తోడేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా విద్యుదుత్పత్తి చేపడుతుందని ఆరోపిస్తూ వైసీపీ ఎంపీలు లోక్ సభ కార్యకలాపాలను అడ్డుకున్నారు. సభలో నిరసన తెలియజేస్తూ వెల్ లోకి వెళ్లారు. ఈ సందర్భఁగా తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి ప్రస్తావించారు. విభజన చట్టం, నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని ఎంపీ అవినాష్ రెడ్డి డిమాండ్. చేశారు.

centre upholds ap governments objections against telangana regimes power production in loksabha

Recommended Video

    TDP Senior Minorty Leader Ziauddin Joined In YSRCP In Presence Of CM | Oneindia Telugu

    అవినాష్ రెడ్డి చేసిన డిమాండ్ పై స్పందించిన కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్.. తెలంగాణ ప్రభుత్వ చర్యలపై తమకు సమాచారం ఉందన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖ కూడా తమకు అందిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వ్యవహారంపై స్పందించి ఇప్పటికే కృష్ణా, గోదావరి రివర్ బోర్డులపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన అంశాన్ని కూడా షెకావత్ గుర్తు చేశారు. దీంతో పాటు విభజన చట్టం ప్రకారం ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో వైసీపీ ఎంపీలు కాస్త శాంతించారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+