ఏపీ నూతన అసెంబ్లీ స్పీకర్ ఖరారు..!?
ఏపీలో ఎన్డీఏ కూటమి పాలన మొదలైంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు..ఉప ముఖ్యమంత్రిగా పవన్ ఎన్నికల హామీలు అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. మంత్రివర్గం కూర్పులో ఈ సారి చంద్రబాబు గతం కంటే భిన్నంగా వ్యవహరించారు. పలువురు సీనియర్లను పక్కన పెట్టారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్పు చేసారు. ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ ఎంపిక పైన కసరత్తు ప్రారంభించారు. ఇద్దరి పేర్లు కొత్త స్పీకర్ గా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
చంద్రబాబు కసరత్తు
ఏపీ శాసనసభా కొత్త స్పీకర్ ఎంపిక పైన చంద్రబాబు తన నిర్ణయం ప్రకటించనున్నారు. అసెంబ్లీలో టీడీపీ కూటమి ఏకపక్షంగా సీట్లు సాధించింది. టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 సీట్లు గెలవగా.. వైసీపీ 11 సీట్లకే పరిమితం అయింది. ప్రతిపక్షం బలహీనంగా ఉండటంతో చంద్రబాబు ఎవరికి స్పీకర్ పదవి ఇస్తారనే చర్చ మొదలైంది. మంత్రివర్గంలో గతంలో అవకాశం రాని కొందరు సీనియర్లకు ప్రాధాన్యత ఇచ్చారు. అదే విధంగా కొత్త వారికి అవకాశం కల్పించారు. ఇక, శాఖల కూర్పులోనూ చంద్రబాబు ఆచితూచి వ్యవహరించారు.

సమీకరణాలే కీలకం
కూటమి ప్రభుత్వం కావటంతో..సమిష్టిగానే నిర్ణయాలు ఉంటాయని చంద్రబాబు -పవన్ ప్రకటించారు. స్పీకర్ పదవి కోసం జనసేన, బీజేపీ నుంచి ఎవరూ ఆశావాహులు లేరు. దీంతో..మంత్రి పదవి దక్కని సీనియర్లకు స్పీకర్ పదవి ఇస్తారనే చర్చ సాగుతోంది. మంత్రివర్గంలో క్షత్రియ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం దక్కలేదు. కూటమి అధికారంలోకి వస్తే రఘురామ రాజుకు స్పీకర్ పదవి ఇస్తారనే ప్రచారం సాగింది. రఘురామ తొలి సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. దీంతో..ఆయనకు ఇవ్వటం సందేహంగానే కనిపిస్తోంది.
ఛాన్స్ దక్కేదెవరికి
పార్టీ సీనియర్లలో చింతకాయల అయ్యన్నపాత్రుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ధూళిపాళ్ల నరేంద్ర పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే, ఆర్దిక శాఖ ఇచ్చిన సామాజిక వర్గానికే స్పీకర్ పదవి ఇవ్వరనే వాదన ఉంది. దీంతో..ఉత్తరాంధ్ర నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడుకు స్పీకర్ గా ఖరారు చేస్తారని పార్టీ ముఖ్య నేతల అంచనా. డిప్యూటీ స్పీకర్ గా రఘురామ రాజు లేదా, లోకం మాధవిలో ఒకరికి అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లోనే స్పీకర్ ఎంపిక పైన చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications