మోదీపై చంద్రబాబు ట్విట్టర్ వార్! మోదీ ఓటమి ఖాయం.. మరో 6రోజులు ఆగితే ఏమవుతుంది?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ప్రధాని మోదీ..ఎన్నికల సంఘం లక్ష్యంగా ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకూ పార్టీ సమావేశాలు..మీడియా తో మాట్లాడే సమయంలో ఆరోపనలు చేసిన చంద్రబాబు..ఇప్పుడు ట్విట్టర్ వేదికగా వార్ ప్రకటించారు. దేశ ప్రజలు ప్రధానిగా మోదీని తిరస్కరించటం ఖాయమని పేర్కొన్నారు.
మోదీని తిరస్కరించం ఖాయం..
తాజా ఎన్నికల్లో బీజీఏ ఓడిపోతారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జోస్యం చెప్పారు. మే 23న దేశ ప్రజలు ప్రధానిగా మోదీని..ఆయన టీమ్ను తిరస్కరించడం ఖాయమని చంద్రబాబు ట్విట్టర్లో స్పష్టం చేశారు. అంపైర్లు లేకుండా చేసి... రిఫరీ సిస్టమ్నే ధ్వంసం చేసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మోదీ టీమ్కు పరాజయం ఖాయమని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం సక్రమంగా ఆడే కొత్త టీమ్ను ప్రజలే ఎంపిక చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారని పేర్కొన్నారు. తమ పోరాటం ఎన్నికల సంఘంపై కాదని, అధికారుల వివక్షతపై, పక్షపాత ధోరణిపైనేనని మరో మారు ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసారు.

మరో ఆరు రోజులు ఆగితే ఏమవుతుంది..
అందరినీ ఒకే రకంగా చూడాల్సిన ఎన్నికల సంఘం.. మోదీ.. అమిత్ షాలపై మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ను ఈసీ అమలు చేయకపోవడంపైనే తమ పోరాటమన్నారు. ఎప్పుడో చనిపోయిన నాయకుల గురించి..వారి కుటుంబ సభ్యులను కించపరిచేలా మోదీ వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. రక్షణ విభాగాలను..సైన్యాన్ని వాడుకుంటూ మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు రాజకీయ నాయకత్వాన్ని చంపేస్తున్నారని దుయ్యబట్టారు.
మా పోరాటం భారత ఎన్నికల సంఘంపై కాదు. మా పోరాటం అధికారుల వివక్షతపై, పక్షపాత ధోరణిపైనే. @narendramodi, @AmitShahలపై మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ను ఈసీ అమలు చేయకపోవడంపైనే మా పోరాటం.
— N Chandrababu Naidu (@ncbn) May 11, 2019
ఎన్నికల షెడ్యూల్కు 73 రోజులు తీసుకున్న ఈసికి 50% వీవీ ప్యాట్ల లెక్కింపునకు మరో 6 రోజులు తీసుకోవడానికి ఎందుకంత అభ్యంతరం..? నరేంద్రమోదీ ఎందుకు భయపడుతున్నారు..? 50% వీవీ ప్యాట్లు లెక్కించాలని ఈసిని ప్రతిపక్షాలు అడిగితే మోదీకి ఏం సంబంధం, ఆయనెందుకు ఉలిక్కిపడుతున్నారు..?
— N Chandrababu Naidu (@ncbn) May 11, 2019
అటువంటి ట్రాక్ రికార్డు ఉన్న ప్రధాని తమకు నీతి వ్యాఖ్యలు చెబుతున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల షెడ్యూల్ కు 73 రోజులు సమయం తీసుకున్న ఎన్నికల సంఘానికి 50 శాతం వీవీ ప్యాట్ల లెక్కింపులను మరో ఆరు రోజుల సమయం తీసుకోవాటానికి ఎందుకు అభ్యంతరమని చంద్రబాబు ప్రశ్నించారు. 50 శాతం వీవీ ప్యాట్లు లెక్కించాలని ప్రతిపక్షాలన్ని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తే మోదీకి ఆ విషయంలో ఏం సంబంధమని..ఆయన ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.
రాజకీయ లాభం కోసం ఎప్పుడో చనిపోయిన నాయకులను, చివరికి నాయకుల కుటుంబ సభ్యులను కించపరిచేందుకు కూడా @narendramodi వెనుకాడరు. రక్షణ శాఖను, సైన్యాన్నీ వాడుకుంటారు. మతాల మధ్య చిచ్చు పెట్టి, రాజకీయ నాయకత్వాన్ని చంపేస్తారు. అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న ఆయన మాకు నీతిపన్నాలు ప్రబోధిస్తారు.
— N Chandrababu Naidu (@ncbn) May 11, 2019
మే 23న దేశ ప్రజలు ప్రధానిగా @narendramodi, అతని టీమ్ను తిరస్కరించడం ఖాయం. అంపైర్లు లేకుండా చేసి, రిఫరీ సిస్టమ్నే ధ్వంసం చేసేలా వ్యవహరిస్తున్న మోదీ టీమ్కు పరాజయం ఖాయం. నిబంధనల ప్రకారం సక్రమంగా ఆడే కొత్త టీమ్ను ప్రజలే ఎంపిక చేసుకుంటారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారు.
— N Chandrababu Naidu (@ncbn) May 11, 2019
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications