2019లో మేమే: బాబు, ఎన్టీఆర్పై పోటీ అని టీడీపీలోకి: ఏకేసిన తలసాని
హైదరాబాద్/మహబూబ్ నగర్: 2019లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీదే అధికారమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. చంద్రబాబు ఈ రోజు పాలమూరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన రాజేంద్ర నగర్ మీదుగా వెళ్లారు.
రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఆధ్వర్యంలో వందలమంది కార్యకర్తలు, నాయకులు బాబుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒక నాయకుడు వెళ్లినంత మాత్రాన వందమందిని తయారు చేసే సత్తా టీడీపీకి ఉందన్నారు.
స్వార్థం కోసమే కొందరు నాయకులు పార్టీని మారుతున్నారని ధ్వజమెత్తారు. నాయకులు స్వార్థం కోసం పార్టీని మారుతున్నా, కార్యకర్తలు మాత్రం పార్టీలోనే ఉంటున్నారని చెప్పారు. ఢిల్లీ ఎప్పుడు వెళ్లినా ఆంధ్రాతో పాటు తెలంగాణ అభివృద్ధి పైన తాను మాట్లాడుతున్నానని చెప్పారు.

ఎర్రబెల్లి, చంద్రబాబులపై విరుచుకుపడ్డ తలసాని
తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుల పైన సనత్ నగర్ ఎమ్మెల్యే, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం విరుచుకుపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్ను ఎర్రబెల్లి దొంగతనంగా ఎందుకు కలిశారో చెప్పాలని నిలదీశారు. తాను సనత్ నగర్ ఉప ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
ఎర్రబెల్లి దద్దమ్మ అని, బ్లాక్ మెయిలర్ అని ఆరోపించారు. చంద్రబాబు వద్ద డబ్బులు వసూలు చేసుకుంటూ పబ్బం గడుపుకుంటారని ధ్వజమెత్తారు. ఇప్పుడు టీడీపీలో ఉన్న వారంతా కలెక్షన్ కింగులేనని ఆరోపించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అభివృద్ధిని చూసి టీడీపీలో చేరారని చెప్పారు. గతంలో ఎన్టీఆర్ పైన పోటీ చేస్తానని ప్రకటించిన చంద్రబాబు ఆ తర్వాత టీడీపీలో ఏ స్వార్థంతో చేరారని ప్రశ్నించారు.
మరోవైపు, చంద్రబాబు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణలో పర్యటిస్తున్నారని తెరాస నేతలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో పాలమూరును దత్తత తీసుకున్నామని గొప్పలు చెప్పుకుని, అభివృద్ధి చేయలేదన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవాలని కేంద్రానికి చంద్రబాబు రాసిన లేఖపై ప్రజలు నిలదీయాలన్నారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications