చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు బిజీ: తోపులాటలో కిందపడిన మహిళా ఎమ్మెల్యే

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu busy: MLA Satyaprabha faces trouble due to Stampede
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బస చేసిన చిత్తూరు జిల్లాలోని కుప్పం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద వినతిపత్రాలు సమర్పించడానికి ప్రజలు ఎగబడ్డారు. దీంతో తోపులాట చోటు చేసుకుంది.

మంగళవారం ఉదయం చంద్రబాబును కలిసేందుకు వచ్చిన చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభను కార్యకర్తలు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఈ ఘర్షణలో ఎమ్మెల్యే సత్యప్రభ క్రింద పడిపోవడంతో స్వల్ప గాయాలయ్యాయి.

కుప్పంలో చంద్రబాబు పర్యటన మంగళవారం ఉదయం ముగిసింది. మంగళవారం ఉదయం పలువురు కార్యకర్తలు ఆర్అండ్‌బీ గెస్ట్‌హైస్‌లో చంద్రబాబుతో భేటీ అయ్యారు. పలు సమస్యలపై చంద్రబాబుకు కార్యకర్తలు, ప్రజలు వినతిపత్రం సమర్పించారు. అందరి సమస్యలను బాబు సావధానంగా విన్నారు. నాలుగు మండలాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు.

ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించిన చంద్రబాబు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం అక్కడి నుంచి హెలీకాఫ్టర్‌లో బెంగుళూరు బయలుదేరి వెళ్లారు. బెంగుళూరు నుంచి ప్రత్యేక విమానంతో సీఎం చంద్రబాబు హైదరాబాద్ వెళ్లనున్నారు.

English summary
MLA Sathyaprabha has faced trouble due to stampede at Chittor district Kuppam R & B guest house during Telugudesam party president and Andhra Pradesh CM Nara Chandrababu Naidu's visit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X