సంచయిత గడువిచ్చి 24 గంటలైనా స్పందించని చంద్రబాబు, నెక్ట్స్ స్టెప్ ఏంటీ, చట్ట ప్రకారం వెళ్తారా..?
మాన్సాస్ ట్రస్ట్ ఉద్యోగుల జీతాలు ఇవ్వడం లేదనే అంశం అగ్గిరాజేసింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కామెంట్లను ట్రస్ట్ చైర్మన్ సంచయిత సీరియస్గా తీసుకున్నారు. తప్పుడు వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలిని డిమాండ్ చేశారు. అయితే 24 గంటలవుతోన్నా చంద్రబాబు స్పందించలేదు. దీంతో సంచయిత ఏం చేస్తారనే ఉత్కంఠ నెలకొంది.
Recommended Video

జీతాలు చెల్లిస్తున్నామే.. చట్ట ప్రకారం చర్యలు...
మాన్సాస్ ట్రస్ట్ ఉద్యోగులకు జీతాలు సక్రమంగా చెల్లిస్తున్నామని సంచయిత స్పష్టంచేశారు. దీనికి సంబంధించి ఈవో, కరస్పాండెంట్ జారీచేసిన నోట్లను ట్వీట్ చేశారు. కానీ కావాలనే తప్పుడు ప్రచారం చేయడంపై మండిపడ్డారు. సీనియర్ నేత, ప్రతిక్ష నేత చంద్రబాబు కామెంట్లపై ఆమె భగ్గుమన్నారు. ఎందుకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

24 గంటలవుతోన్నా స్పందించని చంద్రబాబు
నిన్న సాయంత్రం సంచయిత ట్వీట్లో వార్నింగ్ ఇచ్చారు. శనివారం మధ్యాహ్నం వరకు చంద్రబాబు స్పందించలేదు. దీంతో సంచయిత చంద్రబాబుపై కేసు పెడతారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తమ ఉద్యోగులకు జీతాలు ఇస్తోన్న తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. కేసు నమోదు చేసే అవకాశం ఉంది. సంచయిత వర్సెస్ చంద్రబాబు వార్ ఏ వైపు దారితీస్తోందో చూడాలి.

చంద్రబాబు ట్వీట్ చేయడంతో రగడ..
మాన్సాస్ ట్రస్ట్ ఉద్యోగుల జీతాలకు సంబంధించి చంద్రబాబు శుక్రవారం ట్వీట్ చేశారు. ఉద్యోగులకు 5 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు అని చంద్రబాబు పేర్కొన్నారు. దీంతో వారు రోడ్డెక్కి భిక్షాటన చేస్తున్నారని తెలిపారు. 62 ఏళ్ల ట్రస్ట్ చరిత్రలో ఇలాంటి దయనీయ పరిస్థితి ఎప్పుడూ రాలేదన్నారు. 879 కుటుంబాలు రోడ్డెక్కడం ఎప్పుడూ చూడలేదన్నారు. ట్రస్ట్ను అప్రదిష్ట పాలు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు విమర్శించారు.

క్షమాపణకు డిమాండ్..
ట్రస్ట్కు కోట్ల రూపాయల ఆస్తులు, 124 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని చంద్రబాబు నాయుడు గుర్తుచేశారు. మరీ ఎందుకు జీతాలు ఇవ్వడం లేదు. ఇలా కావడానికి కారణం ఎవరు అని చంద్రబాబు నాయుడు ప్రశ్నలు సంధించారు. ఇలాంటి పరిస్థితికి ట్రస్ట్కు ఎప్పుడూ ఎదురుకాలేదని చెప్పారు. ముందుజాగ్రత్తగా ట్రస్ట్ కోసం భూములు, బాండ్లను పీవీజీ రాజు ఏర్పాటు చేశారని వివరించారు. కానీ అంతటి సంస్థ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడం చూసి బాధ కలుగుతుందన్నారు. దీనిపై సంచయిత నిన్ననే కౌంటర్ ఇచ్చారు. క్షమాపణ చెప్పాలని సాయంత్రం మరో ట్వీట్ చేశారు. దీనిని చంద్రబాబు స్పందించకపోవడంతో.. చట్టపర చర్యలకు ఉఫక్రమించే అవకాశం ఉంది.
శ్రీ @ncbn గారూ మీ ట్వీటు నిస్సిగ్గుగా చేసిన దాడి. మాన్సాస్లో ప్రశాంతతకు భంగం కలిగించాలనుకోవడం బాధ్యతారాహిత్యం. రూల్స్ ప్రకారం చెల్లించిన జీతాలను ఈఓ, కరస్పాండెంట్లు చూపించారు. అయినా తప్పుడు సమాచారం ప్రచారంచేస్తున్నారు. క్షమాపణచెప్పకపోతే చట్టప్రకారం చర్యతీసుకుంటాం. https://t.co/nF9lUUKIN9 pic.twitter.com/8RPzFoYkAQ
— Sanchaita Gajapati (@sanagajapati) August 21, 2020
-
తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు, రేవంత్రెడ్డి "ఉగాది" స్పెషల్ విషెస్ !!! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్












Click it and Unblock the Notifications