వచ్చేవాళ్లు ఇప్పుడే రండి.. ఆలస్యంగా అమరావతికి వస్తే మీకే నష్టం: బాబు కీలక వ్యాఖ్య
ఇప్పుడు గనుక రాష్ట్రానికి రాలేకపోతే ఆ తర్వాత అసలే రాలేరని హెచ్చరించారు. గురువారం ఉదయం హెచ్ఓడీలతో సమావేశమైన సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ: మూడో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తీర్చిదిద్దేందుకు చంద్రబాబు అన్ని విధాలు శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. విదేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షించేందుకు ఈమధ్యే అమెరికా పర్యటనకు కూడా వెళ్లొచ్చారు.
రాష్ట్రానికి కంపెనీలను తీసుకురావడం ద్వారా అటు నిరుద్యోగం లేకుండా చేయడంతో పాటు ఇటు రాష్ట్ర అభివృద్ది కూడా సాధ్యపడుతుందని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పెట్టుబడిదారులకు ఆయన ఓ కీలక సూచన చేశారు. ఏపీలో పరిశ్రమలు స్థాపించాలనుకునే ఔత్సాహికులు త్వరగా అమరావతికి రావాలని పిలుపునిచ్చారు.

ఇప్పుడు గనుక రాష్ట్రానికి రాలేకపోతే ఆ తర్వాత అసలే రాలేరని హెచ్చరించారు. గురువారం ఉదయం హెచ్ఓడీలతో సమావేశమైన సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. అమరావతి ప్రాంతం అన్ని రంగాల పెట్టుబడులకు అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. కాబట్టి ఔత్సహికులు త్వరగా పెట్టుబడులకు సిద్దం కావాలని, లేదు.. భవిష్యత్తులో రావాలని భావిస్తే చాలా నష్టపోతారని తెలిపారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం అనుకూలంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. త్వరతిగతిన అనుమతులిచ్చి, మౌళిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తున్నామని ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
-
ఆ రైతులకు ఏపీ ప్రభుత్వం చల్లని కబురు.. మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications