రేపు హస్తినకు బాబు .. ఢిల్లీ వేదికగా బాబు ఏం చెయ్యనున్నారో ?
Recommended Video

ఏపీలో జరిగిన పోలింగ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సీఎం చంద్రబాబు ఈసీ తీరుపై మండిపడ్డారు .ఈవీఎంలు మొరాయించడంపైనా చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేశారు. రిపేర్ పేరుతో ఈవీఎంల మేనిపులేషన్ జరిగిందన్న చంద్రబాబు మేనిపులేషన్ జరగలేదు అని చెప్పడానికి గ్యారంటీ లేదన్నారు. ఎన్నడూ లేని విధంగా అత్యంత హింసాత్మక విధానంలో ఎన్నికలు జరగటం ఈసీ అసమర్థతకు నిదర్శనం అన్నారు.

కేంద్ర ఎన్నికల సంఘంపై ఫైర్ అయిన చంద్రబాబు .. ఈసీకి నిబద్ధత ఉందా అని ప్రశ్న
కేంద్ర ఎన్నికల సంఘంపైనా చంద్రబాబు మండిపడ్డారు. సాంకేతిక లోపాల పేరుతో ఓటర్లను ఆడుకున్నారని ఈసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు వేసేందుకు వెళ్లిన ఎన్నికల ప్రధాన అధికారికే ఇబ్బంది ఎదురైతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని చంద్రబాబు అన్నారు. ప్రజాస్వామ్యం భవిష్యత్తు ఓ సాఫ్ట్ వేర్ పై ఆధారపడే పరిస్థితి తీసుకురావడం దారుణం అన్నారు. తెల్లవారుజామున వరకు పోలింగ్ జరిగిందంటే.. ఎన్నికల కమిషన్ దీనికి ఏం సమాధానం చెబుతుంది అని చంద్రబాబు ప్రశ్నించారు. అసలు విధుల పట్ల ఈసీకి నిబద్దత ఉందా? అని ప్రశ్నించారు చంద్రబాబు .

హస్తిన బాట పట్టిన బాబు .. ఈసీతో తాడోపేడో తేల్చుకుంటామని ప్రకటన
ఇక ఈ నేపధ్యంలోనే సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రంలో పోలింగ్ నిర్వహణ తీరుపై అసంతృప్తిగా ఉన్న చంద్రబాబు ఈసీని కలిసి ఏపీలో పోలింగ్ పై నిలదీయనున్నారు .. ఎంపీలు, మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్తున్న చంద్రబాబు ఈవీఎంల మొరాయింపు, అధికారుల బదిలీలు, ఇతర అంశాలపై సీరియస్గా చర్చించనున్నారు. అవసరమైతే ధర్నాకు కూడా దిగుతానని చంద్రబాబు చెబుతున్నారు.

పనికిమాలిన ఎలక్షన్ కమీషన్ అంటూ మండిపాటు .. ఏపీ సీఈవోపై ఆగ్రహం
ఇంత పనికిమాలిన ఎలక్షన్ కమిషన్ను తానెప్పుడూ చూడలేదని చంద్రబాబు మండిపడ్డారు. నేరస్తులు ఏమి చెబితే అది ఈసీ పాటిస్తోందన్నారు. ఈవీఎంలు పనిచేయకపోతే మూడుసార్లు వెళ్లి మళ్లీ వచ్చారని స్పష్టంచేశారు. సీఈవోనే ఓటు వేయలేకపోయారని ఎద్దేవాచేశారు. సీఈవోనే ఓటేయలేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. దేశాన్ని భ్రష్టుపట్టించిన మోడీ , ఆయనతో చేతులు కలిపి రాష్ట్ర ప్రయోజనాలకు అడ్డుపడుతున్న కేసీఆర్, నేర చరిత్ర ఉన్న జగన్ కలిసి భ్రష్టు పట్టించిన ఎన్నికలుగా చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు .












Click it and Unblock the Notifications