ఎస్సీ వర్గీకరణకు చంద్రబాబు లైన్ క్లియర్-ఆర్డినెన్స్ జారీ..!
ఏపీలో దశాబ్దాలుగా రిజర్వేషన్ల ఫలాలు అందకుండా దూరంగా ఉండిపోతున్న ఎస్సీలకు ప్రభుత్వం ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణపై ఇవాళ ఆర్డినెన్స్ జారీ చేసింది. రాష్ట్రంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణను అమలు చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇవాళ జీవో జారీ చేసింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణపై బిల్లు పెట్టి ఆమోదించబోతోంది.
ఎస్సీ రిజర్వేషన్లు ఎప్పటి నుంచో అమల్లో ఉన్నప్పటికీ అందులో కొన్ని వర్గాలకే వీటి ఫలాలు అందుతున్నాయన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వీటికి విరుగుడుగా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలనే డిమాండ్ తో మందకృష్ణ మాదిగ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో ఉద్యమాలు చేశారు. దీంతో గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగానే ఎస్సీ వర్గీకరణకు పావులు కదిపారు. దశాబ్దాల పోరాటం తర్వాత ఎస్సీ వర్గీకరణను రాష్ట్రాలు చేసుకునే విధంగా సుప్రీంకోర్టు తాజాగా తీర్పునిచ్చింది.

దీని అమలు కోసం ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఏక సభ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై అసెంబ్లీలో చర్చించి ఆమోదించారు. ఈ మేరకు జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ చేయాలని నిర్ణయించారు. దీని ప్రకారం ఇవాళ ఆర్డినెన్స్ జారీ చేసారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దీన్ని అమలు చేయకుండా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వొద్దంటూ గతంలో మందకృష్ణ మాదిగ సీఎం చంద్రబాబును కోరారు.

దీంతో రాష్ట్రంలో డీఎస్సీ సహా పలు ఉద్యోగ ప్రకటనలు నిలిచిపోయాయి. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడంతో వరుసగా ఉద్యోగ ప్రకటనలు కూడా రాబోతున్నాయి. ఇందులో ముందుగా మెగా డీఎస్సీ ప్రకటన ఐదు రోజుల్లో వస్తుందని మంత్రి నారా లోకేష్ నిన్న ప్రకటించారు. ఇదే క్రమంలో మిగతా ఉద్యోగ ప్రకటనలు కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది.
-
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్"












Click it and Unblock the Notifications