ఇప్పటి నుంచే చెక్: పవన్ కల్యాణ్కు చంద్రబాబు షాక్
హైదరాబాద్: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడి వ్యూహం ఖరారైనట్లే కనిపిస్తోంది. కృష్ణా పుష్కరాలకు ఆహ్వానాలు పంపే విషయంలో పవన్ కల్యాణ్కు చంద్రబాబు షాక్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్కు మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ద్వారా ఆహ్వానం పంపిన ఆయన పవన్ కల్యాణ్ను విస్మరించారు.
గత ఎన్నికల్లో టిడిపి విజయానికి దోహదపడిన పవన్ కల్యాణ్ను చంద్రబాబు ప్రభుత్వం కృష్ణా పుష్కరాలకు ఎందుకు పిలవలేదనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై పవన్ కల్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఎన్టీఆర్ కనీసం ఒక్కరోజు కూడా ప్రచారంలో పాల్గొనలేదు. పిలిస్తే ప్రచారానికి వస్తానని చెప్పినా చంద్రబాబు ఆయనను పట్టించుకోలేదు.

ఇప్పుడు పవన్ కల్యాణ్ను విస్మరించి జూనియర్ ఎన్టీఆర్ను ఆహ్వానించడం వెనక చంద్రబాబు రాజకీయ వ్యూహం దాగి ఉందని అంటున్నారు. రాజధానికి భూసేకరణ వంటి వివిధ సమస్యలపై పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంకేతాలు పంపించారు. కాపు రిజర్వేషన్ల విషయంలో కూడా ఆయన మెతగ్గానే అయినా ప్రభుత్వాన్ని తప్పు పట్టారు.
దానికితోడు 2019 ఎన్నికల్లో జనసేన సొంతంగా పోటీ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో చంద్రబాబు పవన్ను దూరం పెడుతున్నట్లు భావిస్తున్నారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ దూరం కావడం వల్ల జరిగే నష్ఠాన్ని భర్తీ చేసుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ను చేరదీస్తున్నట్లు చెబుతున్నారు.
అయితే, పవన్ కల్యాణ్ను చంద్రబాబు పుష్కరాలకు పిలిచారా, లేదా అనేది మాత్రం పూర్తిగా నిర్ధారణ కావడం లేదు. అయితే, పల్లె రఘునాథ రెడ్డి మిగతా సినీ ప్రముఖులను ఆహ్వానించిన విషయాలు బయటకు కనిపించాయి. పవన్ కల్యాణ్ను మాత్రం ఆహ్వానించినట్లు కనిపించలేదు.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications