కోర్టుకు వెళ్లేందుకు జగన్ కారు ఎక్కితే పాదయాత్ర ఆగినట్లే: టిడిపి నేత ట్విస్ట్
ఏపీలో శ్రీరాముడి పాలన నడుస్తుంటే వైసీపీ అధినేత వైయస్ జగన్ రాక్షసుడిలా వ్యాఖ్యలు చేయడం సరికాదని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు.
అమరావతి: ఏపీలో శ్రీరాముడి పాలన నడుస్తుంటే వైసీపీ అధినేత వైయస్ జగన్ రాక్షసుడిలా వ్యాఖ్యలు చేయడం సరికాదని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు.
ప్రతిపక్ష నేతను ప్రజలే కాకుండా, సొంత కుటుంబ సభ్యులు కూడా నమ్మడం లేదన్నారు. రేపు జగన్ కోర్టుకు ఎలా వెళ్తారని, కారు ఎక్కి వెళ్తే పాదయాత్ర ఆగినట్లే అన్నారు.
Recommended Video

YS Jagan on Paradise Papers leak:ఇలాంటి cm ఉంటే ఎంత ఊడితే ఎంత? 15రోజుల టైమిస్తున్నా| Oneindia Telugu

జగన్ బాధ్యతలను విస్మరిస్తున్నారని బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు అన్నారు. సమావేశాలు బహిష్కరించడం సరికాదన్నారు. వైసీపీ తీసుకున్న నిర్ణయం పెద్ద తప్పు అన్నారు.
అసెంబ్లీకి వెళ్లేందుకే ప్రజలు ఓటేశారని చెప్పారు. జగన్ తన పార్టీ కోసం చూస్తున్నారు తప్ప ప్రజల కోసం కాదన్నారు. తమ పార్టీ టీడీపీకి మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తోందన్నారు.












Click it and Unblock the Notifications