వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీకి ఇది కొత్తేం కాదు, ఎలా రాబట్టుకోవాలో టీడీపీకి తెలుసు: విష్ణు కుమార్ రాజు

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీపై బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు శనివారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ నేతలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకు వెళ్తున్నారని విమర్శించారు.

Recommended Video

TDP Targets Modi Says Somu Veerraju

ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు చెప్పుకోవడం టీడీపీకి కొత్తేమీ కాదని ఎద్దేవా చేశారు. ఓట్లు రాబట్టుకోవడం టీడీపీకి బాగా తెలుసునని చెప్పారు. మిత్ర ధర్మాన్ని టిడిపి కాల రాస్తోందన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎవరో తప్పుడు సలహా ఇస్తున్నారని విమర్శించారు. ఏపీ హక్కుల కోసం పోరాడుతోంది బీజేపీనే అన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే వారిదే గెలుపు అన్నారు.

పార్టీలో మిగిలిన 44 మందికి ఏ ఆపర్లు ఇస్తున్నారో నాకు తెలుసు: బాబుపై జగన్పార్టీలో మిగిలిన 44 మందికి ఏ ఆపర్లు ఇస్తున్నారో నాకు తెలుసు: బాబుపై జగన్

Chandrababu know how to grab votes: Vishnu Kumar Raju

ఏపీకి కేంద్రం చేసింది, చేయబోయేది చెబుతామని ఎంపీ హరిబాబు అన్నారు. ఈ విషయంలో ప్రజల్లో ఉన్న అపోహలను తొలగిస్తామన్నారు.

ప్రత్యేక హోదా అంశం సున్నితమైన అంశమని కేంద్రమంత్రి, టిడిపి నేత అశోక్ గజపతి రాజు అన్నారు. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించిన వారే అన్యాయం జరిగిందని చెప్పడం విడ్డూరమన్నారు. ప్రత్యేక హోదాకు తగ్గ నిధులు ఇస్తామంటేనే ప్యాకేజీకి అంగీకరించామని చెప్పారు. వైసీపీ నేత బొత్స తమపై చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు.

English summary
BJLP Vishnu Kumar Raju on Saturday said that Telugudesam and Chandrababu Naidu know how to grap votes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X