ఏపీ రైస్ మాఫియాపై తమిళనాడు సీఎం స్టాలిన్ కు చంద్రబాబు లేఖ; షాకింగ్ రిక్వెస్ట్!!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమిళనాడు సీఎం స్టాలిన్ కు లేఖ రాశారు. తమిళనాడు రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని చంద్రబాబు స్టాలిన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

రేషన్ బియ్యం దందా చేస్తున్న మాఫియాపై తమిళనాడు సీఎం కు లేఖ
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లలో సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలను బియ్యం స్మగ్లింగ్ మాఫియా దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత ఎన్ చంద్రబాబు నాయుడు. తమిళనాడుపై నిఘా పెంచాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు ఆయన రాసిన లేఖలో పేర్కొన్నారు. తమిళనాడు నుంచి బియ్యం ఏఏ మార్గాలలో ఏపీ లోకి ప్రవేశిస్తుందో కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు . బియ్యం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన వాహనాలను, స్మగ్లర్ల ఫొటోలను కూడా స్టాలిన్ కు రాసిన లేఖతో పాటు చంద్రబాబు జత చేసి పంపించారు.

ఏపీ తమిళనాడు సరిహద్దుల మీద నిఘా పెంచాలని పేర్కొన్న చంద్రబాబు
తమిళ పేదలకు చెందవలసిన పిడిఎస్ బియ్యాన్ని ఆంధ్ర తమిళనాడు సరిహద్దు మీదుగా రాష్ట్రంలోకి తరలిస్తున్నారని చంద్రబాబు సీఎం స్టాలిన్ కు తెలియజేశారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏపీ తమిళ నాడు సరిహద్దు మీద నిఘా పెంచాలని చంద్రబాబు లేఖలో విజ్ఞప్తి చేశారు. ఏపీ- తమిళనాడు సరిహద్దుల్లో తగిన నిఘా లేకపోవడంతో మాఫియా పేదలకు అందాల్సిన పీడీఎస్ బియ్యాన్ని మాఫియా అక్రమంగా తరలిస్తోందని తెలిపారు. తమిళనాడు నుంచి ఏపీకి పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని స్టాలిన్కు చెప్పి మాఫియా ఎలా దందా చేస్తుందో కూడా చంద్రబాబు వివరించారు.

తమిళనాడు చిత్తూరు సరిహద్దుల్లోని ఏడు మార్గాల ద్వారా బియ్యం దందా
తమిళనాడు చిత్తూరు సరిహద్దుల్లోని ఏడు మార్గాల ద్వారా బియ్యం తరలిస్తున్నట్టు చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని రైస్ మిల్లులకు పంపిస్తున్నారని పేర్కొన్నారు. మిల్లర్లు బియ్యాన్ని రీసైకిల్ చేసి పాలిష్ చేసి తమ స్మగ్లింగ్ భాగస్వాములకు తిరిగి పంపుతున్నారని వెల్లడించారు. పాలిష్ చేసిన బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరలకు విక్రయించడం లేదా కర్ణాటకకు అక్రమంగా తరలించడం జరుగుతుందని చంద్రబాబు నాయుడు లేఖలో తెలియజేశారు.

స్టాలిన్ తో పాటు ఏపీ సీఎస్ కు లేఖ.. స్పందిస్తారా?
తమిళనాడు నుంచి ఏపీకి బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నా, మిల్లర్లు రీసైక్లింగ్ కు పాల్పడుతూ దందా చేస్తున్నా ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చంద్రబాబు నాయుడు నేరుగా సీఎం స్టాలిన్ కు రేషన్ మాఫియాపై దృష్టి సారించాలని లేఖ రాశారు. ఇక ఏపీలో రేషన్ దందాకు సంబంధించి నిత్యావసర వస్తువుల చట్టం కింద కుప్పంలోనే దాదాపు 13 కేసులు నమోదయ్యాయని చంద్రబాబు పేర్కొన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు చంద్రబాబు ఏపీ సిఎస్ కు కూడా రేషన్ దందాపై చంద్రబాబు లేఖ పంపించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందవలసిన బియ్యం, పేదలకు చేరకుండా అక్రమార్కుల ధనార్జనకు ఉపయోగపడుతున్న తీరుపై చంద్రబాబు రాసిన లేఖకు తమిళనాడు సీఎం స్టాలిన్ ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications