సింగపూర్ ప్రధానికి అభినందనలు, తెలుగు జాతి చరిత్రలోనే: చంద్రబాబు
అమరావతి: అక్టోబర్ 22న జరిగే నవ్యాంధ్ర నూతన రాజధాని భూమి పూజ కార్యక్రమం తెలుగు జాతి చరిత్రలోనే ఓ నూతన అధ్యయనం అవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 33వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్ దేశంలోనే చారిత్రాత్మకమన్నారు.
దీనిని ఒక నమూనాగా జాతీయ స్థాయి మీడియాలో కథనాలు వెలువడుతున్నాయన్నారు. అంతక ముందు సింగపూర్ ప్రధానిగా తిరిగి ఎన్నికైన లీసిన్ లూంగ్కు సీఎం చంద్రబాబు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. శుక్రవారం వెలువడిన సింగపూర్ పార్లమెంటుఎన్నికల ఫలితాల్లో అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ(పీఏపీ) ఘనవిజయం సాధించింది.
89 సీట్లకు గాను 83 స్థానాలను కైవసం చేసుకుని విజయఢంకా మోగించింది. దీంతో ప్రధానిగా లీసీన్ లూంగ్ తిరిగి ఎన్నికయ్యారు. దాదాపు అర్ధ శతాబ్ధకాలంగా అధికారంలో ఉన్న పార్టీని ఓడించాలనుకున్న ప్రతిపక్షం కలలు కల్లలయ్యాయి. 1965లో సింగపూర్ ఏర్పడిన నాటి నుంచి ప్రతి ఎన్నికలోనూ పీపుల్స్ యాక్షన్ పార్టీ విజయం సాధిస్తుండడం విశేషం.

సింగపూర్ ప్రజలు లీసీన్ లూంగ్ నాయకత్వంపై నమ్మకం ఉంచి తిరిగి అధికారాన్ని కట్టబెట్టారని సీఎం చంద్రబాబు కొనియాడారు. కాగా, నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి భవిష్యత్తులో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సింగపూర్ ప్రభుత్వం ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.
భారత్లోని ఆంధ్రప్రదేశ్తో కలిసి పనిచేసేందుకు సింగపూర్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆ దేశ ప్రధానిగా తిరిగి ఎన్నికైన లీసీన్ లూంగ్ శుక్రవారం లేఖ కూడా రాశారు. ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో భాగస్వామిగా అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Hearty congratulations to @leehsienloong on being re-elected as PM of Singapore. People have placed their trust in your leadership.
— N Chandrababu Naidu (@ncbn) September 12, 2015
ఏపీ రాజధాని నిర్మాణానికి రైతుల విరాళం
ఏపీ రాజధాని నిర్మాణానికి ఆ ప్రాంత రైతులు విరాళమిచ్చారు. శనివారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబునాయుడిని తుళ్లూరు ప్రాంతానికి చెందిన రైతులు కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తమకు చెల్లించిన వార్షిక అద్దెల మొత్తం రూ. 3, 52, 679 చెక్ను రాజధాని నిర్మాణానికి విరాళమిస్తున్నట్లు ప్రకటిస్తూ ఆ మొత్తాన్ని సీఎంకి అందజేశారు.
పట్టిసీమ లాగా పోలవరాన్ని పూర్తి చేయాలి: బీజేపీ నేతలు
పోలవరం పనులు నిరాశ కలిగిస్తున్నాయని బీజేపీ నేతలు అన్నారు. శనివారం ఉదయం పోలవరం ప్రాజెక్టును బీజేపీ నేతల బృందం పరిశీలించింది. పట్టిసీమ లాగే పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నట్లు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు కోరారు.
సాధారణంగా రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి కావాలంటే మూడు సంవత్సరాలు పడుతుందని, కానీ పట్టిసీమ ప్రాజెక్టును ఏడాదిలోపే పూర్తి చేసిన ఘనత చంద్రబాబుదేనని ఆయన అన్నారు. అంతేకాదు పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని రాజమండ్రిలోనే ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రాజెక్టును సందర్శించిన బృందంలో రాష్ట్రమంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు కూడా ఉన్నారు.
-
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications