ట్యాపింగ్: ఏపీ కేబినెట్కు డీజీపీ, బాబు ఆగ్రహం..!
హైదరాబాద్: కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ఏపీ మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు పోలీసు అధికారులపై తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తినట్లు తెలుస్తోంది. ఏపీ సచివాలయంలోని ఎల్ బ్లాకులో జరుగుతున్న ఈ సమావేశానికి ఏపీ డీజీపీ రాముడు ప్రత్యేకంగా హాజరయ్యారు.
సాధారణంగా కేబినెట్ సమావేశాలకు పోలీసులకు అనుమతి ఉండదు. కానీ, ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు ఆడియో టేపుల, తదనంతర పరిణామాల నేపథ్యంలో దీనిపై సమగ్రంగా చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం జేవీ రాముడిని ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఏపీ మంత్ర వర్గ సమావేశానికి డీజీపీ రాముడు, ఇంటెలిజెన్స్ చీఫ్ అనూరాధ తదితరులు కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు సీఎం ఫోన్ ట్యాప్ అవుతున్నా ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు దాన్ని గుర్తించడంలో విఫలం అయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
A glimpse of the ongoing Cabinet meeting. pic.twitter.com/W7CXzHBrlt
— AP Government (@AndhraPradeshCM) June 9, 2015 ఏపీ ఇంటిలిజెన్స్ విభాగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ సమావేశంలో తన ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి లేదని, ఇది చట్టరీత్యా చెల్లదని కేబినెట్లో తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సమావేశం ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు.
బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ, హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసే అవకాశం ఉంది. జూన్ 10న ఢిల్లీలో చైనా ప్రతినిధులతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. ఉమ్మడి రాజధానిలో గవర్నర్ అధికారులపై కేంద్రంతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications