గాలి-జగన్ ఈడీ కేసుల్లో సడలింపు, మీ తప్పులు నా నెత్తిన వేసుకోను: బీజేపీపై బాబు ఆగ్రహం
అమరావతి: తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కేసులను సడలిస్తున్నారని, అవినీతి పరులను పక్కన పెట్టుకొని బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు.

మీ తప్పిదాలు నా మీద వేసుకోను
తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తిరుపతిలో నిర్వహించిన ధర్మ పోరాట సభ విజయవంతమైందని చంద్రబాబు అన్నారు. పార్టీలోని నేతలు చేసిన తప్పిదాలు తనపై వేసుకునేందుకు సిద్ధంగా లేనని ఆయన చెప్పారు. నేతల ప్రతి చర్యకూ ప్రజలలో ప్రతి చర్య ఉంటుందని వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం పోరాడుతామన్నారు.

మోడీని విమర్శించాలా, నన్నా?
తిరుపతి తరహా మరో 12 చోట్ల ధర్మపోరాట సభలు నిర్వహిస్తామని చంద్రబాబు చెప్పారు. రెండో సభ విశాఖలో ఉంటుందని, చివరి సభ అమరావతిలో ఉంటుందని చెప్పారు. వైసీపీ నేతలు ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీని విమర్శిస్తారా లేక పోరాటం చేస్తున్న టీడీపీని విమర్శిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ అటాచ్మెంట్లు సడలిస్తున్నారు
వైయస్ జగన్ పైన ఈడీ అటాచ్మెంట్లు సడలిస్తున్నారని చంద్రబాబు అన్నారు. కర్నాటకలో గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన మైనింగ్ కేసులు తొలగిస్తున్నారని చెప్పారు. ఇదేనా అవినీతిపై బీజేపీ చేసో పోరాటం అని ప్రశ్నించారు. కుడి, ఎడమల అవినీతిపరులను పెట్టుకొని బీజేపీ ప్రజలకు ఏం సందేశం ఇస్తోందన్నారు.

బీజేపీ లాలూచీ రాజకీయాలకు కర్నాటక ఎన్నికలు కేస్ స్టడీ
మనపై ఉద్దేశ్యపూర్వకంగా దాడి జరుగుతోందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంలో నిన్నటి వరకు అత్యున్నత పదవులలో ఉన్న వారు పుస్తకాలు రాస్తున్నారని అన్నారు. తిరుపతి సభ పెట్టిన రోజే వైసీపీ విశాఖపట్నంలో వంచన దినం పెట్టడం వెనుక అజెండా ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ లాలూచీ రాజకీయాలకు కర్నాటక ఎన్నికలే కేస్ స్టడీ అని చంద్రబాబు అన్నారు.
-
జగన్కు విజయమ్మ షాక్: నీ చెల్లికి, మేనల్లుడికి అన్యాయం చేశావు -
కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. -
కనిపించిన నెలవంక.. దేశవ్యాప్తంగా "రంజాన్" వేడుకలకు వేళాయే !! -
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
అవార్డుల గురించి చంద్రబాబుకు పాఠాలు చెప్పిన చిరంజీవి... విన్నారా? -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ??












Click it and Unblock the Notifications