నా వల్లే హైదరాబాద్కు మెట్రో, హెచ్ఐసీసీ టిడిపి వల్లే, నేను కొట్లాడా: చంద్రబాబు
Recommended Video
అమరావతి: హైదరాబాదులోని హెచ్ఐసీసీలో గ్లోబల్ ఎంటర్ప్రెన్యూయర్షిప్ సమ్మిట్, అలాగే హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభోత్సవంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం స్పందించారు. ఆయన ఏపీ అసెంబ్లీలో మీడియాతో పిచ్చాపాటీగా మాట్లాడారు.
ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభించిన విషయం తెలిసిందే. దీని కోసం నగర ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ప్రపంచ వాణిజ్య సదస్సు జరుగుతోంది. ఈ రెండు కార్యక్రమాలపై మీడియా ప్రతినిధులు చంద్రబాబును ప్రశ్నించారు. దీంతో ఆయన స్పందించారు.
బాబు, కేసీఆర్ ప్రభుత్వాలపై రామ్చరణ్ సతీమణి ఉపాసన, గొప్ప అవకాశమని మంచు ల
నా వల్లే హైదరాబాదుకు మెట్రో వచ్చింది
హైదరాబాదుకు మెట్రో రైలు తన వల్లే వచ్చిందని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధిలో తన ముద్ర ఏమాత్రం పోయేది కాదని వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను మెట్రో కోసం పోరాడానని తెలిపారు.
వైయస్ వల్లే ఆలస్యం అయింది
బెంగళూరు, అహ్మదాబాదుల జాబితాలో హైదరాబాదు కూడా ఉండాలని చెప్పానని చంద్రబాబు తెలిపారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి వల్లే హైదరాబాద్ మెట్రో ఆలస్యం అయిందని చెప్పారు. లేదంటే అది ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండెనని ఆయన అభిప్రాయపడ్డారు.
అవన్నీ టీడీపీ హయాంలోనివే
ప్రస్తుతం గ్లోబల్ ఎంటర్ప్రెన్యూయర్షిప్ జరుగుతున్న హెచ్ఐసీసీ, అలాగే శంషాబాద్ విమానాశ్రయం ఇవన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలోనివేనని చంద్రబాబు గుర్తు చేశారు. తనకు హైదరాబాదును అభివృద్ధి చేశానన్న సంతృప్తి ఉందని, అది చాలని చెప్పారు.
తెలుగు భాష పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం
తెలుగుదేశం పార్టీ పేరులోనే తెలుగు ఉందని, తెలుగు భాషా పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు అంతకుముందు అసెంబ్లీలో అన్నారు. తెలుగు భాష పరిరక్షణకై తీర్మానం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.