'కనీసం ఈ రోజు ఇచ్చిన మాటనైనా చంద్రబాబు నిలబెట్టుకోవాలి'
దరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉరవకొండ శాసన సభ్యుడు విశ్వేశ్వర్ రెడ్డి ఆదివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు తన పుట్టిన రోజు నాడు ఇచ్చిన మాటనైనా నిలబెట్టుకోవాలని హితవు పలికారు.
చంద్రబాబు పాలనలో హంద్రీనీవాకు రూ.13 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారన్నారు. ఇది వాస్తవం కాదా చెప్పాలన్నారు. వైయస్ హయాంలో హంద్రీనీవా పనులు వేగవంతంగా జరిగాయని చెప్పారు. హంద్రీనీవా కాలయాపనకు చంద్రబాబే కారణమని ధ్వజమెత్తారు.

రాయలసీమ ప్రజలు దుర్భర జీవితం అనుభవిస్తున్నారన్నారు. మద్దతు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సింగపూర్, జపాన్ వంటి వాటిని పక్కన పెట్టి రైతుల గురించి ఆలోచించాలన్నారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉండాలన్నారు. చంద్రబాబు రైతుల చెవుల్లో పూవులు పెట్టవద్దన్నారు.
ముస్సోరికి చంద్రబాబు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ముస్సోరి వెళ్లనున్నారు. అక్కడి లాల్ బహదూర్ శాస్ర్తి అకాడమీలో ట్రైనీ ఐఏఎస్లను ఉద్దేశించి సీఎం బాబు ప్రసంగించనున్నారు. బ్యూరోక్రసీ, పాలసీ మేకింగ్పై చంద్రబాబు ఉపన్యసిస్తారు. అనంతరం ఢిల్లీలో జరిగే టీడీపీ పార్లమెంటరీ సమావేశంలో బాబు పాల్గొంటారు.
-
అవార్డుల గురించి చంద్రబాబుకు పాఠాలు చెప్పిన చిరంజీవి... విన్నారా? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?












Click it and Unblock the Notifications