వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: ఆ 40 స్థానాల్లో పార్టీ బలహీనం, తీరు మార్చుకోకపోతే మార్చేస్తా: బాబు సంచలనం

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ రాష్ట్రంలోని 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టిడిపి పరిస్థితి బాగా లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.పదవుల్లో ఉన్న వారు సక్రమంగా పని చేయకపోతే తప్పిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. ఒకరిద్దరు మంత్రులు మినహ ఎవరూ కూడ సక్రమంగా పని చేయడం లేదని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.

Recommended Video

YSRCP operation aakars on Chandrababu Naidu Right Hand

నల్లారి కిషోర్‌కుమార్‌ రెడ్డి ఎఫెక్ట్: మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీనాధరెడ్డితో వైసీపీ నేతల భేటీ, బాబుకునల్లారి కిషోర్‌కుమార్‌ రెడ్డి ఎఫెక్ట్: మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీనాధరెడ్డితో వైసీపీ నేతల భేటీ, బాబుకు

టిడిపి సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం సాయంత్రం అమరావతిలో జరిగింది. ఈ సమావేశంలో పార్టీ పనితీరుపై పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు చర్చించారు.

టార్గెట్ 2019: వారసులు బరిలోకి, వైసీపీకి చెక్ పెట్టేలా జెసి ప్లాన్ ఇదే!టార్గెట్ 2019: వారసులు బరిలోకి, వైసీపీకి చెక్ పెట్టేలా జెసి ప్లాన్ ఇదే!

2019 ఎన్నికల కోసం పార్టిని బలోపేతం చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. అయితే పార్టీ అధినేత సూచనలకు అనుగుణంగా పార్టీ నేతలు, మంత్రులు పని చేయడం లేదని చంద్రబాబునాయుడు అసంతృప్తిని వ్యక్తం చేశారు.

40 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై బాబు అసంతృప్తి

40 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై బాబు అసంతృప్తి

ఏపీ రాష్ట్రంలోని 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ 40 నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసే విషయంలో చర్యలు తీసుకోవాలని చంద్రబాబునాయుడు పార్లమెంటరీ నియోజకవర్గాల ఇంఛార్జీలు, మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులను ఆదేశించారు. ఈ 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని మెరుగుపర్చుకొనేందుకు అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జీలు పనిచేయాలని బాబు ఆదేశించారు. లేకపోతే ఇంఛార్జీలను మార్చనున్నట్టు చంద్రబాబు హెచ్చరించారు.

మంత్రులు పనితీరు మార్చుకోవాలి

మంత్రులు పనితీరు మార్చుకోవాలి

పార్లమెంటరీ నియోజకవర్గాల ఇంఛార్జీలుగా ఉన్న మంత్రుల పనితీరు సక్రమంగా లేదని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. పార్టీని బలోపేతం చేసేందుకు మంత్రులు చొరవ చూపాలని బాబు ఆదేశించారు. ఒకరిద్దరూ మినహ మిగిలిన మంత్రులెవరూ కూడ పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవడం లేదని బాబు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో మంత్రులు పరిటాల సునీత, భూమా అఖిలప్రియను చంద్రబాబునాయుడు సున్నితంగా మందలించారని సమాచారం.

ఆ నేతల పనితీరుపై బాబు ఇలా

ఆ నేతల పనితీరుపై బాబు ఇలా


పార్టీ ప్రధాన కార్యదర్శులుగా ఉంటూ పార్లమెంటరీ నియోజకవర్గాల ఇంచార్జీలుగా వ్యవహరిస్తున్న నేతల పనితీరుపై బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పయ్యావుల కేశవ్, వర్ల రామయ్య,,కొత్తపల్లి సుబ్బారాయుడు పనితీరుపై బాబు అసంతృప్తిని వ్యక్తం చేశారు. పనితీరును మెరుగుపర్చుకోవాలని బాబు వారికి సూచించారు.పార్టీని బలోపేతం చేయడానికి నేతలు చొరవ తీసుకోవాలని బాబు సూచించారు.

40 నియోజకవర్గాల నేతలతో బాబు సమావేశం

40 నియోజకవర్గాల నేతలతో బాబు సమావేశం


పార్టీ బలహీనంగా ఉన్న 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆ 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఇంచార్జీలతో సమావేశాన్ని కానున్నట్టు చంద్రబాబునాయుడు ,ప్రకటించారు. ఈ సమావేశం తర్వాత కూడ మార్పు రాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. మరో వైపు పదవులు తీసుకొన్న నేతలు పార్టీ బలోపేతం కోసం చర్యలు తీసుకోకపోతే చర్యలు తప్పవని బాబు హెచ్చరించారు.

English summary
Chandrababu Naidu was unhappy over the party's situation in 40 assembly segments . chandrababu naidu meeting with party leaders on Tuesday at Amaravathi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X