Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

షాక్: ఆ 40 స్థానాల్లో పార్టీ బలహీనం, తీరు మార్చుకోకపోతే మార్చేస్తా: బాబు సంచలనం

అమరావతి: ఏపీ రాష్ట్రంలోని 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టిడిపి పరిస్థితి బాగా లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.పదవుల్లో ఉన్న వారు సక్రమంగా పని చేయకపోతే తప్పిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. ఒకరిద్దరు మంత్రులు మినహ ఎవరూ కూడ సక్రమంగా పని చేయడం లేదని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.

Recommended Video

    YSRCP operation aakars on Chandrababu Naidu Right Hand

    టిడిపి సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం సాయంత్రం అమరావతిలో జరిగింది. ఈ సమావేశంలో పార్టీ పనితీరుపై పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు చర్చించారు.

    2019 ఎన్నికల కోసం పార్టిని బలోపేతం చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. అయితే పార్టీ అధినేత సూచనలకు అనుగుణంగా పార్టీ నేతలు, మంత్రులు పని చేయడం లేదని చంద్రబాబునాయుడు అసంతృప్తిని వ్యక్తం చేశారు.

    40 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై బాబు అసంతృప్తి

    40 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై బాబు అసంతృప్తి

    ఏపీ రాష్ట్రంలోని 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ 40 నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసే విషయంలో చర్యలు తీసుకోవాలని చంద్రబాబునాయుడు పార్లమెంటరీ నియోజకవర్గాల ఇంఛార్జీలు, మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులను ఆదేశించారు. ఈ 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని మెరుగుపర్చుకొనేందుకు అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జీలు పనిచేయాలని బాబు ఆదేశించారు. లేకపోతే ఇంఛార్జీలను మార్చనున్నట్టు చంద్రబాబు హెచ్చరించారు.

    మంత్రులు పనితీరు మార్చుకోవాలి

    మంత్రులు పనితీరు మార్చుకోవాలి

    పార్లమెంటరీ నియోజకవర్గాల ఇంఛార్జీలుగా ఉన్న మంత్రుల పనితీరు సక్రమంగా లేదని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. పార్టీని బలోపేతం చేసేందుకు మంత్రులు చొరవ చూపాలని బాబు ఆదేశించారు. ఒకరిద్దరూ మినహ మిగిలిన మంత్రులెవరూ కూడ పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవడం లేదని బాబు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో మంత్రులు పరిటాల సునీత, భూమా అఖిలప్రియను చంద్రబాబునాయుడు సున్నితంగా మందలించారని సమాచారం.

    ఆ నేతల పనితీరుపై బాబు ఇలా

    ఆ నేతల పనితీరుపై బాబు ఇలా


    పార్టీ ప్రధాన కార్యదర్శులుగా ఉంటూ పార్లమెంటరీ నియోజకవర్గాల ఇంచార్జీలుగా వ్యవహరిస్తున్న నేతల పనితీరుపై బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పయ్యావుల కేశవ్, వర్ల రామయ్య,,కొత్తపల్లి సుబ్బారాయుడు పనితీరుపై బాబు అసంతృప్తిని వ్యక్తం చేశారు. పనితీరును మెరుగుపర్చుకోవాలని బాబు వారికి సూచించారు.పార్టీని బలోపేతం చేయడానికి నేతలు చొరవ తీసుకోవాలని బాబు సూచించారు.

    40 నియోజకవర్గాల నేతలతో బాబు సమావేశం

    40 నియోజకవర్గాల నేతలతో బాబు సమావేశం


    పార్టీ బలహీనంగా ఉన్న 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆ 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఇంచార్జీలతో సమావేశాన్ని కానున్నట్టు చంద్రబాబునాయుడు ,ప్రకటించారు. ఈ సమావేశం తర్వాత కూడ మార్పు రాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. మరో వైపు పదవులు తీసుకొన్న నేతలు పార్టీ బలోపేతం కోసం చర్యలు తీసుకోకపోతే చర్యలు తప్పవని బాబు హెచ్చరించారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+