'బాబు విడ్డూరం', ఎంపీలను అంటే బాబును అన్నట్టు కాదా?,
విజయవాడ : సొంత పార్టీ వ్యక్తిని అవతలి వ్యక్తి టార్గెట్ చేస్తున్నప్పుడు.. విమర్శలను తిప్పికొట్టడంలో పార్టీ నాయకుడు ముందుంటాడు. అయితే ఏపీ అధికార పార్టీ పాలిటిక్స్ లో మాత్రం ఈ సీన్ పూర్తిగా రివర్స్. టీడీపీ ఎంపీలను పవన్ అన్నేసి మాటలంటే.. చంద్రబాబు మాత్రం 'నన్నయితే ఏమి అనలేదుగా' అంటూ స్పందించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
మొన్నటి తిరుపతి సభలో టీడీపీ ఎంపీలు మురళీ మోహన్, అశోక గజపతిరాజు, కేశినేని నాని మరియు మంత్రి నారాయణ లాంటి నేతలను పవన్ కడిగిపారేసిన సంగతి తెలిసిందే. హిందీ నేర్చుకోండంటూ ఎంపీలందరికీ హితవు పలికిన పవన్.. ఎంపీలంతా ఢిల్లీలో 'సార్.. సార్..' అంటూ ఏపీ ఆత్మ గౌరవాన్ని తాకట్టుపెడుతున్నారని వ్యంగ్యంగా చురకలంటించారు. ఈ విషయంలో ఎంపీలకు సిగ్గు, శరం లేదా? అంటూ సూటిగానే ప్రశ్నించారు పవన్.

ఓవైపు పవన్ వ్యాఖ్యలపై ఎంపీలంతా అగ్గి మీద గుగ్గిలం అవుతుంటే.. చంద్రబాబు మాత్రం తననేమి అనలేదు కదా అంటూ సంతృప్తి చెందడం సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తిని రాజేసేదిగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ వ్యాఖ్యలను ఖండించపోగా.. తనను టార్గెట్ చేయకపోవడం పట్ల చంద్రబాబు సంతోషంగా ఉండడం విడ్డూరంగా ఉందన్న వాదన వినిపిస్తోంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications