జగన్ కు చంద్రబాబు ఫోన్ కాల్-కానీ ఏం జరిగిందంటే ?
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం తర్వాత సీఎంగా రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి పలువురు వీఐపీలకు ఆహ్వానాలు పంపుతున్నారు. ఇందులో సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు ఉన్నారు. ఇదే క్రమంలో మాజీ సీఎం వైఎస్ జగన్ కు కూడా చంద్రబాబు స్వయంగా ఫోన్ చేశారు. అయితే జగన్ మాత్రం అందుబాటులో లేకుండా పోయారు.

రేపు గన్నవరంలో జరిగే చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోడీ, అమిత్ షా, రజనీకాంత్, చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు హాజరు కాబోతున్నారు. వీరికి ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపడంతో పాటు వ్యక్తిగతంగా కూడా చంద్రబాబు ఫోన్ కాల్స్ చేసి ఆహ్వానిస్తున్నారు. అయితే ఇందులో భాగంగా జగన్ కు కూడా కాల్ చేసి మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ఆయన మాత్రం అందుబాటులోకి రాలేదని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు రేపటి చంద్రబాబు ప్రమాణస్వీకారానికి దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకే ఫోన్ కాల్ లోనూ చంద్రబాబుకు జగన్ అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. జగన్ తో పాటు ఇతర వైసీపీ నేతలు కూడా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి దూరంగా ఉండబోతున్నట్లు సమాచారం. గతంలో జగన్ తన ప్రమాణస్వీకారానికి చంద్రబాబును రావాలని కోరినా ఆయన కూడా వెళ్లలేదు. దీంతో ఇప్పుడు జగన్ కూడా దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications