అమిత్ షాకు చంద్రబాబు ఫోన్: ఆరోగ్య పరిస్ధితిపై వాకబు..
కేంద్ర హోంమంత్రి అమిత్షాకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. ఇటీవల అమిత్షా అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. షా పూర్తిగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
అమిత్ షాకు కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. గత నెల 2వ తేదీన వైరస్ సోకడంతో గురుగ్రామ్లో వేదాంత ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. తర్వాత వైరస్ తగ్గడంతో ఆగస్టు 14న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆ తర్వాత హోం ఐసోలేషన్లో ఉన్నారు. కానీ మరోసారి అనారోగ్య సమస్య తలెత్తింది. కానీ ఈ సారి వేదాంత ఆస్పత్రి కాక ఎయిమ్స్లో చేరారు.
తర్వాత శ్వాసకోస, ఇతర అనారోగ్య పరిస్థితులు తలెత్తాయి. దీంతో గత నెల 18న ఢిల్లీ ఎయిమ్స్లో చేరారు. అక్కడ చికిత్స పొందిన అమిత్షాకు ఆరోగ్యం మెరుగైంది. దాదాపు 11 రోజుల తర్వాత ఆగస్టు 31వ తేదీ సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. దీంతో అమిత్షాకు చంద్రబాబు ఫోన్ చేశారు. ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. తర్వాత ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించినట్టు తెలిసింది.