కెనడా, టొరంటో ప్రతినిధులతో బాబు భేటీ: ‘ఆరోగ్యమస్తు’ రిలీజ్(పిక్చర్స్)
హైదరాబాద్/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం ‘ఆరోగ్యమస్తు' మేగజైన్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన ఇసుక పాలసీపై మంత్రులు, అధికారులతో సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడారు. ఏపీకి బ్రాండింగ్ కోసమే దావోస్లో పర్యటించానన్నారు. కాళ్ల నొప్పులు తిరగబెడుతున్నా తాను కష్టపడుతున్నానని చెప్పారు. సానుకూల దృక్పథంతో పని చేస్తున్నానన్నారు. అక్కడ ఏ ఇద్దరు కలిసినా భారత్ గురించే మాట్లాడుకుంటున్నారని చెప్పారు. మన దేశం పట్ల అక్కడ సానుకూల వాతావరణం ఉందన్నారు.
స్విస్ పర్యటనలో మొత్తం 35 ఈవెంట్లలో పాల్గొన్నట్టు చెప్పారు. బిల్గేట్స్తోపాటు వాల్మార్ట్, లూలూ, గూగుల్ తదితర సంస్థల ప్రతినిధులను కలిశానన్నారు. ఆ తర్వాత ఏపి సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్కు సంబంధించిన డైరీని విడుదల చేశారు. అనంతరం ఫెయిర్ ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్, టొరంటో, కెనడా, ఇతర ప్రతినిధులతో చంద్రబాబు నాయుడు సచివాలయంలో భేటీ అయ్యారు.
చంద్రబాబు
ఇసుక పాలసీపై మంత్రులు, అధికారులతో సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న దృశ్యం.
చంద్రబాబు
ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడారు. ఏపీకి బ్రాండింగ్ కోసమే దావోస్లో పర్యటించానన్నారు. కాళ్ల నొప్పులు తిరగబెడుతున్నా తాను కష్టపడుతున్నానని చెప్పారు.
చంద్రబాబు
ఏపి సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్కు సంబంధించిన డైరీని విడుదల చేశారు.
చంద్రబాబు
ఫెయిర్ ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్, టొరంటో, కెనడా, ఇతర ప్రతినిధులతో చంద్రబాబు నాయుడు సచివాలయంలో భేటీ అయ్యారు.
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం ‘ఆరోగ్యమస్తు' మేగజైన్ను ఆవిష్కరించారు.