మా తీరుపై జగన్ 'సాక్షి' కూడా సంతృప్తి: బాబు ఆసక్తికర వ్యాఖ్య
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నోట నుంచి మరోసారి వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రిక పైన మాట్లాడారు. సాక్షి పత్రిక వ్యతిరేక కథనాలు రాయలేకపోతుందని ఆయన అన్నారు.
పుష్కర ఏర్పాట్లపై మంగళవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సాక్షి పత్రిక పేరును ప్రస్తావించారు. పుష్కర ఏర్పాట్లకు సంబంధించి జనం సంతృప్తిగా ఉన్నారన్నారు. చివరకు సాక్షి కూడా వ్యతిరేకంగా రాయలేకపోతోందని, తద్వారా పుష్కరాల ఏర్పాట్లపై జగన్ పత్రిక కూడా సంతృప్తి వ్యక్తం చేసినట్లేనని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు బుధవారం నాడు పుష్కరాలపై సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. కృష్ణా పుష్కరాల్లో అర్ధభాగం విజయవంతంగా పూర్తి చేశామన్నారు. డబ్బుల వసూలుపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

మరిన్ని ఉచిత బస్సులను భక్తులకు అందుబాటులోకి తేవాలన్నారు. పద్మావతి ఘాట్ వద్ద ఉదయం ఐదు నుంచి పదకొండు గంటల వరకు భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని చెప్పారు. యాత్రికులను నియంత్రించే అంశాలపై ఆయన సూచనలు చేశారు.
గవర్నర్ దంపతుల పుష్క స్నానం
తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు పుష్కర స్నానమాచరించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో విజయవాడ చేరుకున్న గవర్నర్ దంపతులు పున్నమి ఘాట్లో పుణ్య స్నానం చేశారు. అనంతరం ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు.
-
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications