ఇంటర్లో ర్యాంకులు ఎత్తేయాలి, 18 గంటలు చదువా: కాలేజీలపై బాబు సీరియస్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు సోమవారం కాలేజీ యాజమాన్యాలతో భేటీ అయ్యారు.
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు సోమవారం కాలేజీ యాజమాన్యాలతో భేటీ అయ్యారు.
లేఖలో ఏముందో చూసుకోకుండా సంతకం, ఇదీ జగన్ అంటే: దేవినేని
ఇటీవల ప్రయివేటు కళాశాలల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డ విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం సీరియస్గా ఉంది. చంద్రబాబు, మంత్రి గంటా యాజమాన్యాలతో భేటీ అయ్యారు.
కార్పోరేట్ కాలేజీల తీరుపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. కళాశాల యాజమాన్యాలు, ప్రభుత్వ అధికారులతో కలిసి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
పిల్లలను ప్రతి రోజు 18 గంటల చదువుకు పరిమితం చేసే సమయపాలన మారాలని చంద్రబాబు అన్నారు. సమయపాలన మారాలన్నారు.
ఇంటర్లో ర్యాంకులు ఎత్తేసి గ్రేడింగ్ విధానం తీసుకు రావాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఆ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పిల్లలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మార్కులు తెచ్చే యంత్రాల్లా చూడవద్దన్నారు.