ఆ మాటకు నరాలు బిగుసుకుపోయాయి.. సిగ్గు, బాధ కుదిపేశాయి: చంద్రబాబు
ఏపీ పెట్టుబడిదారులంటే మోసానికి ప్రతీకలన్న అభిప్రాయాలను తుడిచిపెట్టేలా చేసి.. వారిపై విశ్వాసం కలిగించే స్థాయికి తీసుకొచ్చానని చంద్రబాబు ధీమాగా చెప్పారు.
విజయవాడ: అమరావతిలో బుధవారం నాడు జరిగిన కేబినెట్ భేటి అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా గతంలో ఆయనకు ఎదురైన ఓ అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు. ఏపీ ప్రజలను అవమానపరిచేదిగా ఉన్న ఆ ఘటనను తలుచుకుంటూ చంద్రబాబు ఆవేదన చెందారు.
అమెరికాకు చెందిన ఓ వెంచర్ క్యాపిటలిస్ట్ తనను కలిసినప్పుడు అన్న మాటలను సీఎం మీడియా సమావేశం సందర్బంగా ప్రస్తావించారు. ఆంధ్ర పెట్టుబడిదారులంటే మోసానికి కేరాఫ్ అనే అర్థం వచ్చేలా సదరు క్యాపిటలిస్ట్ మాట్లాడారట. ఆ మాటలు విన్న వెంటనే తన నరాలు బిగుసుకుపోయాయని, సిగ్గు, బాధ తనను కుదిపేశాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ఆ మాటలకు బదులిస్తూ.. ఎన్నాళ్ల క్రితం ఈ పరిస్థితి మీకు కనిపించిందని సదరు క్యాపిటలిస్టును చంద్రబాబు ప్రశ్నించారట. దీనికి ఆయన ఓ నాలుగేళ్ల క్రితం అని సమాధానం చెప్పారట. ఆ సమయంలో కేంద్రంలోను, రాష్ట్రంలోను అధికారంలో ఉన్నది కాంగ్రెస్ కాబట్టి..వారి హయాంలో కొన్ని తప్పులు జరిగాయన్నారు చంద్రబాబు.
ఏపీ పెట్టుబడిదారులంటే మోసానికి ప్రతీకలన్న అభిప్రాయాలను తుడిచిపెట్టేలా చేసి.. వారిపై విశ్వాసం కలిగించే స్థాయికి తీసుకొచ్చానని చంద్రబాబు ధీమాగా చెప్పారు.