Chandrababu Cabinet: పవన్ తో సహా నూతన మంత్రులు వీరే - చంద్రబాబు మార్క్ ఎంపిక..!!
Chandrababu Cabinet:ఏపీలో నూతన ప్రభుత్వం కొలువు తీరేందుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం సిద్ధమైంది. ఇక చంద్రబాబు క్యాబినెట్లో మొత్తం 25 మంది ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత చంద్రబాబు తన మంత్రివర్గ సభ్యులను ప్రకటించారు. అంచనాలకు భిన్నంగా మంత్రులు ఎంపికలో చంద్రబాబు తన మార్కు చూపించారు.
జనసేన నుంచి
చంద్రబాబు తన కొత్త మంత్రివర్గంలో జనసేనకు మూడు, బిజెపికి ఒక మంత్రి పదవి కేటాయించారు. ముగ్గురు మహిళలను ఎంపిక చేశారు. జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కు అవకాశం దక్కింది. బిజెపి నుంచి సత్య కుమార్ మాత్రమే మంత్రి కానున్నారు. టిడిపి నుంచి నారా లోకేష్ తో పాటుగా అచ్చం నాయుడు, కొల్లు రవీంద్ర, నారాయణ, వంగలపూడి అనిత, రామానాయుడు, నంద్యాల ఎమ్మెల్యే ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి ఉన్నారు.

అనూహ్య ఎంపిక
వీరితో పాటుగా ప్రకాశం జిల్లా నుంచి డోల బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, అనంతపురం జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే సవిత, తూర్పుగోదావరి నుంచి వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మందపల్లి రాంప్రసాద్రెడ్డిలను చంద్రబాబు ఎంపిక చేశారు. కొందరు సీనియర్లతో పాటు తొలిసారి ఎమ్మెల్యే అయిన వారికి సైతం తన మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకున్నారు. మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న పలువురు సీనియర్లకు స్థానం దక్కలేదు.

సీనియార్టీ - యువత కు ప్రాధాన్యత
అనూహ్యంగా విశాఖ జిల్లా నుంచి కేవలం ఎస్సీ మహిళ వంగలపూడి అనితకు మాత్రమే క్యాబినెట్లో అవకాశం దొరికింది. అక్కడ నుంచి గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు మంత్రివర్గంలో బెర్తు ఆశించారు. అదేవిధంగా తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలోనూ చంద్రబాబు ఎంపిక చర్చనీయాంశం గా మారింది. ఇక బీసీలకు ఈసారి ప్రాధాన్యత పెరిగింది. అనంతపురం జిల్లా నుంచి పయ్యావుల కేశవ తో పాటు బిజెపి ఎమ్మెల్యే సత్య కుమార్ పేరు ఎంపిక చేశారు. తమకు మంత్రి పదవులు ఖాయం అనుకున్న పలువురు సీనియర్లకు నిరాశ తప్పలేదు. బిజెపి నుంచి ఇద్దరికీ అవకాశం దక్కుతుందని భావించినా.. ఒక్కరికి ఛాన్స్ దక్కింది. కడప జిల్లా నుంచి రాయచోటి ఎమ్మెల్యే మందపల్లి రాంప్రసాద్ రెడ్డికి క్యాబినెట్లో అవకాశం కల్పించారు.
-
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!











Click it and Unblock the Notifications