వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదే బస్సు: 16 నుంచి ప్రజల వద్దకు చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 16 నుంచి ప్రజల మద్యకు కార్యక్రమం చేపట్టనున్నారు. ఆయన తన పర్యటనను వినూత్నంగా రూపొందించుకుంటున్నారు. చంద్రబాబు ఒక దఫా పర్యటనలో రెండు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోనున్నారు.

జిల్లాలో రెండు నియోజకవర్గాలకు రెండు రోజులు కేటాయించనున్నారు. డ్వాక్రా మహిళలు, రైతులతో విడివిడిగా చంద్రబాబు నాయుడు ముఖాముఖి మాట్లాడనున్నారు. జిల్లా అధికారులకూ, పార్టీ కార్యకర్తలకూ సమయం కేటాయించనున్నారు.

 Chandrababu to tour AP from July 16

పాదయాత్ర సమయంలో బస కోసం ఉపయోగించిన బస్సునే ఇప్పుడూ రాత్రిపూట బసకు చంద్రబాబు ఉపయోగించుకోనున్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐపీఎస్ బదిలీలకు రంగం సిద్ధం చేసినట్లుగా సమాచారం.

ఖాళీగా ఉన్న విశాఖ కమిషనర్, ఏలూరు రేంజ్ డీఐజీ, రాయలసీమ రేంజ్ ఐజీ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. పోలీసుల బదిలీలపై చంద్రబాబు నాయుడు శుక్రవారం సుదీర్ఘ సమీక్ష జరిపినట్లు తెలియవచ్చింది.

English summary

 Andhra Pradesh CM Nara Chandrababu Naidu to tour state from July 16.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X