మన తెలివి తట్టుకోలేకే: అమెరికా దాడులపై బాబు, పంపండి.. సుష్మాకు జగన్
మన తెలివి తేటలు చూసి తట్టుకోలేకనే అమెరికాలో మన వాళ్ల పైన దాడులు చేస్తున్నారని ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు అన్నారు.
విజయవాడ: మన తెలివి తేటలు చూసి తట్టుకోలేకనే అమెరికాలో మన వాళ్ల పైన దాడులు చేస్తున్నారని ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు అన్నారు.
ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అమెరికాలో మన వాళ్ల పైన దాడులు చాలా బాధాకరమన్నారు. దాడులను అమెరికా వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు.
సుష్మా స్వరాజ్కు జగన్ లేఖ
కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్కు ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు లేఖ రాశారు. అమెరికాలో జాత్యాహంకార దాడుల నేపథ్యంలో హైలెవల్ కమిటీని అమెరికాకు పంపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా అమెరికా చర్యలు తీసుకునేలా చూడాలన్నారు. ఎన్నారైలలో నెలకొన్న అభద్రతా భావాన్ని తొలగించే చర్యలు చేపట్టాలని జగన్ కోరారు.

భారతీయులు ముందంజ
కష్టించి పనిచేసే తత్వంతో పాటు ఏ దేశంలో ఉన్నా ఆ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించడంలో భారతీయులు ముందుంటారు. గూగుల్కు సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్కు సత్యా నాదెళ్ల, పెప్సీ కంపెనీకి ఇంద్రానూయి, మాస్టర్ కార్డ్ సీఈవోగా అజయ్ బంగా, అడోబ్ సీఈవోగా శంతను నారాయణ్ తదితరులు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
-
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications