Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడికి కీలక పదవి..!!

తిరుపతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుపతి జిల్లా చంద్రగిరి శాసన సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడ చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డికి కీలక పదవి లభించింది. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మెన్‌గా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తుడా ఛైర్మన్‌గా బాధ్యతలను స్వీకరించిన తేదీ నుంచి మూడు సంవత్సరాల పాటు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆ పదవిలో కొనసాగుతారు. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి.. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. తుడా ఛైర్మన్‌కు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో ఎక్స్‌అఫీషియోగా సభ్యత్వం ఉంటుంది.

Chevireddy Mohit Reddy appointed as a Chairman of TUDA

వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా పేరుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి. ఆవిర్భావం నుంచీ పార్టీలో కొనసాగుతూ వస్తోన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మకస్తుల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2014, 2019 ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు.

వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాస్కర్ రెడ్డి పోటీ చేయకపోవచ్చని తెలుస్తోంది. ఆయన స్థానంలో మోహిత్ రెడ్డికి టికెట్ దక్కడం దాదాపుగా ఖరారైంది. ప్రస్తుతం మోహిత్ రెడ్డి.. తిరుపతి రూరల్ ఎంపీపీగా ఉన్నారు. చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాలను ఆయనే పర్యవేక్షిస్తోన్నారు.

గడప గడపకు కార్యక్రమంలో మోహిత్ రెడ్డి పాల్గొనడం పట్ల ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఏ అధికారంతో ఆయన ఈ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొంటోన్నారంటూ నియోజకవర్గ టీడీపీ నాయకులు ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. తుడా ఛైర్మన్‌గా అపాయింట్ కావడంతో.. ఆ విమర్శలకు ప్రభుత్వం చెక్ పెట్టినట్టయింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+