వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనాపై పోరు : కొవ్వొత్తులు వెలిగించి సంఘీభావం ప్రకటించిన కేసీఆర్,జగన్

|
Google Oneindia TeluguNews

కరోనాపై పోరులో మరోసారి దేశ ఐక్యతను చాటేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు యావత్ భారతం దీప కాంతులు,ఫ్లాష్ లైట్స్‌తో వెలిగిపోయింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాత్రి 9 గంటలకు ప్రగతిభవన్‌లో దీపాలు వెలిగించి సంఘీభావం ప్రకటించారు. కేసీఆర్‌తో పాటు ఆరోగ్యశాఖ మంత్రి మంత్రి ఈటెల రాజేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఉన్నతాధికారులు కూడా ప్రగతి భవన్‌లో కొవ్వొత్తులు వెలిగించారు.గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కుటుంబసభ్యులతో కలిసి రాజ్‌భవన్‌లో కొవ్వొత్తులు వెలిగించారు. ఇక రాష్ట్ర మంత్రులు,ఎమ్మెల్యేలంతా తమ తమ నివాసాల్లో దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపారు.

Recommended Video

AP CM Jagan, CM KCR And Chandrababu Naidu Light Candles, Diyas

అటు ఏపీలో ముఖ్యమంత్రి జగన్ కూడా తాడేపల్లిలోని తన నివాసంలో కొవ్వొత్తులు వెలిగించి సంఘీభావం ప్రకటించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్‌ కొవ్వొత్తులు వెలిగించారు. ఇరు రాష్ట్రాల్లోనూ ప్రజలంతా తమ ఇళ్ల ముందు,బాల్కనీల్లో దీపాలు వెలిగించి మరోసారి ఐక్యతను,సంఘీభావాన్ని చాటిచెప్పారు.

chief ministers kcr and ys jagan light candles over the fight against coronavirus
English summary
All India light up with flashlights and candles following Prime Minister Narendra Modi's call for a unification of the country once again in the war against Corona. Telangana Chief Minister KCR expressed the solidarity with the lights at Pragatibhavan at 9 pm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X