నల్లమల అటవీ అందాలు, సోమశిల మీదుగా.. హైదరాబాద్ నుండి బెంగళూరుకు బుల్లెట్ రైలు!

హైదరాబాద్, బెంగళూరు మహానగరాల మధ్య అత్యాధునిక బుల్లెట్ ట్రైన్ సేవను ప్రారంభించేందుకు సంబంధించిన సర్వే పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించిన ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లో తెలంగాణ ప్రభుత్వం సూచించిన మార్పులతో కొత్త రూట్ మ్యాప్ సిద్ధమైంది. ఈ మార్గం నల్లమల అటవీ ప్రాంతాలు మరియు సోమశిల ప్రకృతి అందాల మీదుగా వెళ్తుందని తెలుస్తోంది.

హైదరాబాద్‌లోని కోకాపేట నుంచి బుల్లెట్ ట్రైన్ మార్గం

ఇది కేవలం రవాణా సౌకర్యం మాత్రమే కాకుండా, పర్యాటకం, ఆర్థిక అభివృద్ధికి కూడా బలమైన మార్పులు తీసుకురానుంది. కొత్త ప్రణాళిక ప్రకారం హైదరాబాద్‌లోని కోకాపేట నుంచి ఈ బుల్లెట్ ట్రైన్ మార్గం ప్రారంభమవుతుంది. శంషాబాద్, భారత్ ఫ్యూచర్ సిటీ, మన్ననూరు, సోమశిల వంటి ప్రాంతాల గుండా సాగి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించి, చివరికి కర్ణాటక రాజధాని బెంగళూరులో ముగుస్తుంది.

Hyderabad to Bengaluru Bullet Train through nallamala forest somasila this is new proposed route

ఐదు అత్యాధునిక హైస్పీడ్ స్టేషన్ల ఏర్పాటు

తెలంగాణలో ఈ ప్రాజెక్టు సుమారు 205 కిలోమీటర్ల మేరకు విస్తరించనుంది. ఈ మార్గంలో ఐదు అత్యాధునిక హైస్పీడ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇవి శంషాబాద్, భారత్ ఫ్యూచర్ సిటీ, ఆమన్‌గల్లు, మన్ననూరు, సోమశిలలో ఉండనున్నాయి. ఇంతకు ముందు ప్రతిపాదిత మార్గం మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, కర్నూలు వంటి ప్రాంతాల గుండా వెళ్లాలని ఉండేది.

ఈ అందమైన మార్గాల నుండే హైస్పీడ్ రైలు

అయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రైలు సౌకర్యాలు ఉన్న ప్రాంతాలకు బదులుగా, ఇంకా అభివృద్ధి చెందని, పర్యాటక సామర్థ్యం ఉన్న ప్రాంతాల మీదుగా రైలు మార్గాన్ని మళ్లించాలని సూచించింది. ఈ సూచనలను నేషనల్ హైస్పీడ్ రైల్ కారిడార్ లిమిటెడ్ స్వీకరించింది. ఫలితంగా నల్లమల అటవీ ప్రాంతం, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కృష్ణా నది తీరంలోని సోమశిల వంటి అందమైన ప్రదేశాలు ఈ మార్గంలో చేరాయి.

అత్యాధునిక ఎకో-ఫ్రెండ్లీ టెక్నాలజీలు, ఇంజినీరింగ్ డిజైన్లతో ప్లాన్

నల్లమల అడవుల్లో మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు ఉన్నభాగం టైగర్ రిజర్వ్ జోన్‌లో ఉండటం, ఘాట్ రోడ్లు ఉండటం వల్ల పర్యావరణపరమైన అనుమతులు, సాంకేతిక సవాళ్లు ఎదురవుతాయని అంచనా. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి అత్యాధునిక ఎకో-ఫ్రెండ్లీ టెక్నాలజీలు, ఇంజినీరింగ్ డిజైన్లను అనుసరించనున్నారు. కోకాపేట నుంచి శంషాబాద్ వరకు మొదటి భాగానికి, ఔటర్ రింగ్ రోడ్ వెంబడి లేదా దాని వెలుపల నుంచి మార్గం నిర్మించడం అనే దానిపైన సర్వే జరుగుతోంది.

2న్నర నుంచి 3 గంటల్లో హైదరాబాద్ నుండి బెంగుళూరుకు

ఈ బుల్లెట్ ట్రైన్ గంటకు 250 నుంచి 300 కిలోమీటర్ల వేగంతో నడిచే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య ప్రయాణ సమయం కేవలం 2న్నర నుంచి 3 గంటల్లో పూర్తి అవుతుంది. ప్రస్తుతం రోడ్డు మార్గంలో 10-12 గంటలు పడుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే రెండు ఐటీ హబ్‌ల మధ్య వాణిజ్య, పర్యాటక, ఉద్యోగ అవకాశాలు భారీగా పెరుగుతాయి.

ఈ పర్యాటక ప్రాంతాలు జాతీయ స్థాయి ఆకర్షణ కేంద్రాలుగా

ముఖ్యంగా మన్ననూరు, సోమశిల వంటి పర్యాటక ప్రాంతాలు జాతీయ స్థాయి ఆకర్షణ కేంద్రాలుగా మారతాయి. స్టేషన్ల చుట్టూ ఆర్థిక కేంద్రాలు ఏర్పడి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి. ప్రాథమిక సర్వే పూర్తి అయిన తర్వాత డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) సిద్ధం చేస్తారు. దీనిలో పర్యావరణం, భూగర్భ నిర్మాణం, సామాజిక ప్రభావాలను పరిగణనలోకి తీసుకొని చిన్న చిన్న మార్పులు చేయవచ్చు. ఆమోదం పొందిన తర్వాత భూసేకరణ ప్రక్రియ మొదలవుతుంది.

బండి భగీరథ్ పోక్సోకేసు: బండి సంజయ్ పై ప్రచారం ఆపండి.. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు
బండి భగీరథ్ పోక్సోకేసు: బండి సంజయ్ పై ప్రచారం ఆపండి.. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు

హైస్పీడ్ రైలు నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసేలా హైస్పీడ్ రైల్ కారిడార్

ఈ ప్రాజెక్టు దక్షిణ భారతదేశంలో హైస్పీడ్ రైలు నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేస్తుంది. పర్యావరణాన్ని రక్షిస్తూ, అభివృద్ధిని సాధించే ఈ కారిడార్ రాష్ట్రాల మధ్య సమగ్ర అనుసంధానానికి ఉదాహరణగా నిలుస్తుంది. ఈ మెగా ప్రాజెక్టు వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు ఆర్థికంగా ముందుకు సాగడంతో పాటు, ప్రయాణీకులకు సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణ సౌకర్యం లభిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+