బాబుకు డెడ్లైన్: మళ్లీ చిరు-దాసరి, సరైన టైంలో రంగంలోకి పవన్ కళ్యాణ్
రాజమహేంద్రవరం: కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష నేపథ్యంలో కాపు నేతలు మరోసారి రాజమహేంద్రవరంలో గురువారం భేటీ కానున్నారని తెలుస్తోంది. ముద్రగడ దీక్ష, షరతుల పైన రెండు రోజుల్లో స్పందించాలని లేదంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చిరంజీవి, దాసరి నారాయణ రావులు రెండు రోజుల క్రితం హెచ్చరించిన విషయం తెలిసిందే.
చిరు-దాసరిని ఏకం చేసిన బాబు, ముద్రగడ వెనుక... 'డబుల్' ధమాకా
ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరంలో రేపు భేటీ కానున్నారని తెలుస్తోంది. ఈ భేటీకి చిరంజీవి, దాసరి నారాయణ రావు, బొత్స సత్యనారాయణ తదితర కాపు నేతలు హాజరు కానున్నారని తెలుస్తోంది. పోలీసులు రాజమహేంద్రవరంలో అనుమతించకుంటే విజయవాడలో భేటీ కానున్నారని తెలుస్తోంది.
నువ్వేం చేశావ్: చిరంజీవిపై అనిత ఫైర్, ఇదీ ముద్రగడ ఆరోగ్య పరిస్థితి..
మరోవైపు, కాపు అంశంపై ఇంతలా చర్చ జరుగుతుంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రావడం లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే, ఆయన సరైన సమయంలో బయటకు వస్తారని ఆయన అభిమానులు చెబుతున్నారు.
ఎమ్మెల్యేలను కొనాల్సిన పని లేదు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యేలను కొనాల్సిన పని లేదని, అలాగే, టిడిపిలో చేరుతున్న వైసిపి ఎమ్మెల్యేలకు అమ్ముడుపోవాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే చాంద్ బాషా అన్నారు. తమకు అమ్ముడుపోయే అవసరం లేదన్నారు.
ముద్రగడ ఒంటరి కాడు, ఆంధ్రాలో ఉన్నామా.. పాక్లోనా: దాసరి, తోడు చిరు
వచ్చే కేబినెట్ విస్తరణలో మైనార్టీలకు అవకాశం ఉంటుందని చెప్పారు. హైదరాబాదులో హజ్ హౌజ్ నిర్మించింది చంద్రబాబేనని గుర్తు చేశారు. కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారని ఈ సందర్భంగా చాంద్ బాషా వ్యాఖ్యానించారు.