'చిరు, దాసరిలు కాపులకు చేసిందేం లేదు, పట్టుకోల్పోయిన బాబు'
విజయవాడ: కాంగ్రెస్ పార్టీ ఎంపీ చిరంజీవి, మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణ రావుల పైన సిపిఐ నేత రామకృష్ణ సోమవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిరంజీవి, దాసరి నారాయణ రావులు కేంద్రమంత్రులుగా ఉన్నప్పుడు ఏం చేశారని, వారు కాపులకు చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ఆ వర్గానికి వారు ఏం న్యాయం చేయలేకపోయారని మండిపడ్డారు. ఇప్పుడు మాట్లాడడం విడ్డూరమని అభిప్రాయపడ్డారు.
ఏపీలో లంచగొండితనం బాగా పెరిగిపోయిందని విమర్శించారు. 'ఏరువాక' పేరుతో మంత్రులు, ప్రభుత్వం హడావుడి చేస్తోందని ధ్వజమెత్తారు. ఇది సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రంలో పదకొండువేల మంది కౌలు రైతులు ఉంటే కేవలం పదకొండు మందికి మాత్రమే రుణాలు ఇవ్వడం సరికాదన్నారు.
ముద్రగడపై జగన్ ప్లాన్: చిరంజీవిని దాసరి కార్నర్ చేస్తున్నారా?
ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులు పాలన పైన పట్టు కోల్పోయారన్నారు.
ఏపీలో ఏరువాక కార్యక్రమం
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం చిట్టవరంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు (సోమవారం) ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. చంద్రబాబు నాగలితో పొలాన్ని దున్ని ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.