నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సింహపురిని రాజధాని చేస్తా: చిరంజీవి మెగా హామీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi promises to make Simhapuri as capital
నెల్లూరు: కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగిస్తే సింహపురిని సీమాంధ్రకు రాజధానిగా మారుస్తామని కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడు చిరంజీవి హామీ ఇచ్చారు. సోమవారం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కాంగ్రెస్ పార్టీ తరపున పార్లమెంటు అభ్యర్థి అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డితో కలసి ఆయన ర్యాలీ చేపట్టారు.

అనంతరం బహిరంగ సభలో చిరంజీవి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ పేదలకు అందించినన్ని సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అందించలేదన్నారు. మరోసారి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని కోరారు.

రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆనం రామనారాయణరెడ్డి ఆత్మకూరు నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారని, మళ్లీ ఆనం రామనారాయణ రెడ్డిని శాసనసభ్యునిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత నియోజకవర్గ ప్రజలపై ఉందన్నారు.

విభజన నేపధ్యంలో సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి అభివృద్ధి చేస్తామని, ప్రత్యేక ప్యాకేజీ అంటే అభివృద్ధికి ఎంత అవసరమైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

English summary
Congress leader Chiranjeevi has promised to make Simhapuri as Seemandhra capital. He orgnaised election rally in Nellore district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X