ఈవెంట్ హవా: పెళ్లి ఫ్యామిలీతో యాంకర్ ఫోజు(పిక్చర్స్)
హైదరాబాద్: ఈవెంట్ మేనేజ్మెంట్లో ఉపాధి అవకాశాలు మెరుగు అవుతున్నాయని ప్రముఖ యాంకర్, వర్ధమాన నటి చిత్రలేఖ అన్నారు. వివాహ శుభకార్యాలతో పాటు పుట్టిన రోజు వేడుకలను వైభవంగా నిర్వహించుకునేందుకు చాలామంది ఉత్సాహం చూపుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో అందుకు అవసరమైన డెకరేషన్ సామాగ్రికి మంచి డిమాండ్ ఉంటోందన్నారు.
బుధవారం హైదరాబాదులోని పద్మానగర్ రింగు రోడ్డు ఐడిపిఎల్ కాలనీ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సాయిరామ్ ఫైబర్ టెక్ సంస్థను చిత్రలేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
అన్ని రకాల ఈవెంట్లకు అవసరమైన సామాగ్రి ఒకేచోట దొరకడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు కూడా వేడుకలను అట్టహాసంగా జరుపుకుంటున్న తరుణంలో వేదికల్లో కొత్తదనం కనిపిస్తోందన్నారు.

సాయిరాం 1
బుధవారం హైదరాబాదులోని పద్మానగర్ రింగు రోడ్డు ఐడిపిఎల్ కాలనీ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సాయిరామ్ ఫైబర్ టెక్ సంస్థను చిత్రలేఖ ప్రారంభించారు.

సాయిరాం 2
ఈవెంట్ మేనేజ్మెంట్లో ఉపాధి అవకాశాలు మెరుగు అవుతున్నాయని ప్రముఖ యాంకర్, వర్ధమాన నటి చిత్రలేఖ బుధవారం అన్నారు.

సాయిరామ్ 3
సాయిరామ్ ఫైబర్ టెక్ అదినేత మోతుకూరి శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని రకాల డెకరేటివ్ మెటీరియల్ను ఫైబర్ గ్లాస్, చైనా క్లే, యాక్సిరలేటర్ క్యాటలిస్టుతో ఎలాలైడ్ ప్రాసెస్తో అచ్చులు వేసి తయారు చేస్తామని చెప్పారు.

సాయిరామ్ 4
తాము హైదరాబాదుతో పాటు కర్నాటక, చెన్నై, కోల్కతాలకు కూడా మెటీరియల్ను సరఫరా చేస్తున్నామని, సీజన్లో ఈ ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంటుందని మోతుకూరి శ్రీనివాస్ తెలిపారు.

సాయిరామ్ 5
అన్ని రకాల ఈవెంట్లకు అవసరమైన సామాగ్రి ఒకేచోట దొరకడం వల్ల ఎంతో ప్రయోజనం ప్రముఖ యాంకర్, వర్ధమాన నటి చిత్రలేఖ బుధవారం అన్నారు.












Click it and Unblock the Notifications