అమరావతి భూముల కొనుగోలుపై దూకుడు పెంచిన సీఐడీ: రంగంలోకి ఈడీ కూడా
అమరావతి: ఏపీ కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా అమరావతి భూములపై సీఐడీ విచారణను ముమ్మరం చేసింది. నాలుగు వేల ఎకరాల్లో భూముల కొనుగోలు అక్రమాలు జరిగినట్లు సబ్ కమిటీ నివేదిక తేల్చిన విషయం తెలిసింది. భూములు కొనుగోలు చేసిన రాజకీయ నాయకులపై సీఐడీ విచారణ కొనసాగిస్తోంది.
ఇప్పటికే తెల్ల రేషన్ కార్డు హోల్డర్లు భూముల కొనుగోలుపై విచారణ ప్రారంభించిన సీఐడీ.. 790 మంది తెల్ల రేషన్ కార్డు హోల్డర్లు భూములు కొనుగోలు చేసినట్లు గుర్తించింది. అమరావతి కోర్ ఏరియాలో 720 ఎకరాల భూమిని తెల్ల రేషన్ కార్డు హోల్డర్ కొనుగోలు చేశారు.
అమరావతి భూముల కొనుగోలుపై విచారణ చేయాలంటూ ఇప్పటికే ఈడీకి లేఖ రాసింది సీఐడీ. ఈ క్రమంలో రెండు రోజుల్లో ఈడీ రంగంలోకి దిగనుంది. భూముల కొనుగోలులో మనీలాండరింగ్ జరిగిందంటూ అనుమానం వ్యక్తం చేసింది సీఐడీ.

కాగా, సబ్ కమిటీ నివేదకలో పేర్కొన్న 4వేల ఎకరాల భూములు కొనుగోలు చేసిన వారిలో ఎక్కువగా టీడీపీ నేతల ఉండటం గమనార్హం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్, టీడీపీ నేతలు పయ్యావుల కేశవ్, తదితర నేతలకు సంబంధించిన భూములు ఉన్నట్లు ఇప్పటికే వైసీపీ నేత, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీ వేదికగా వెల్లడించారు.
సీఐడీ ప్రధాన కార్యాలయం
రాష్ట్ర పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రకటించిన నేపథ్యంలో.. సీఐడీ ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు అనువైన భవనం కోసం సంబంధిత అధికారులు అన్వేషణ ప్రారంభించారు. ఇందుకోసం 50 వేల చదరపు అడుగుల వైశాల్యం కలిగిన భవనం కావాల్సి ఉంటుందని, ఇందుకోసం సీఐడీ డీఐజీ త్రివిక్రమవర్మ నగరానికి వచ్చినట్లు తెలిసింది. మూడు రోజులపాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి తగిన భవనాలను గుర్తించి ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు సమాచారం.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications