వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!!
వంట గ్యాస్ సంక్షోభం వేళ సీఎం చంద్రబాబు కీలక దిశా నిర్దేశం చేసారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరా పైన ఆరా తీసారు. కొరత వార్తల వేళ గ్యాస్ కోసం వినియోగదారులు ముందస్తుగానే బుకింగ్స్ చేసు కొంటున్నారు. కమర్షియల్ సిలిండర్ల సరఫరా దాదాపు నిలిచిపోయింది. హోటల్స్ చాలా వరకు మూసి వేసారు. కొనసాగుతున్న హోటల్లు ధరలు పెంచేసాయి. ఈ క్రమంలో మొత్తం పరిస్థితి పైన సమీక్ష చేసిన చంద్రబాబు కీలక మార్గ నిర్దేశం చేసారు.
రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై పలువురు మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM ఈరోజు(శనివారం) టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో గ్యాస్ సరఫరా అంశంపై వివరంగా చర్చించారు. ప్రస్తుత పరిస్థితులను ముఖ్యమంత్రికి మంత్రి పయ్యావుల కేశవ్ వివ రించారు. గ్యాస్ సరఫరా అంశంపై ఏర్పాటైన మంత్రుల సబ్ కమిటీ భేటీ అవుతున్నట్లు సీఎంకు మంత్రులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఏం చేయాలో, ఎంత చేయాలో అంతా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని అన్ని ఎఫర్ట్స్ పెట్టి సమస్య లేకుండా ప్రయత్నాలు చేయాలని సీఎం ఆదేశించారు. హోటళ్లు సహా భాగస్వామ్య పక్షాలతో మాట్లాడి వాస్తవ పరిస్థితికి అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలని మంత్రులకు చంద్రబాబు సూచనలు ఇచ్చారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా చూడాలని మంత్రులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

మంత్రివర్గ ఉప సంఘం సమీక్ష.. నిర్ణయాలు
ఈ క్యాబినెట్ సబ్ కమిటీలో మంత్రులు నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు ఉన్నారు. ఈరోజు సివిల్ సప్లై భవనంలో మంత్రుల సమావేశం జరగనుంది. కాగా.. ఇప్పటికే హోటల్స్ అసోసియేషన్ నేతలు ప్రభుత్వంతో చర్చలు చేసారు. అంతకు ముందు సమావేశమైన వారంతా ప్రతీ సోమవారం హోటల్స్ హాలిడే అమలు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం తమకు కమర్షియల్ సిలిండర్లు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటు ప్రభుత్వం సైతం రాష్ట్రంలో డొమెస్టిక్ గ్యాస్ కు ఎలాంటి ఇబ్బంది లేదని... కమర్షియల్ సిలిండర్లలోనే కొంత సమస్య ఉందని చెబుతోంది. ఆస్పత్రులు.. హాస్టల్స్ కు ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా చర్యలు చేపడుతోంది. అయితే, గ్యాస్ అందక పలు ప్రాంతాల్లో హోటల్స్ మూసి వేసారు. కొనసాగుతున్న చోట ధరలు పెంచారు. కాగా.. ఇళ్లకు వినియోగించే గ్యాస్ సరఫరాలో ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
-
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
ఏపీలో మహిళలకు దక్కే నియోజకవర్గాలు లిస్టు ఇదే, కీలక మంత్రుల స్థానాలు సైతం..!! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!!













Click it and Unblock the Notifications