పుట్టా మహేష్ పై తేల్చేసిన చంద్రబాబు, పార్టీ వీళ్లను మోయాలా..!!
టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ వ్యవహారం పై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఆయన తీరు పై మండిపడ్డారు. పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే ఇలాంటి వాళ్లను మోయాలా..? అంటూ అసహనం వ్యక్తం చేశారు. యువకుడు.. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారని అతడికి అవకాశమిచ్చామని వివరించారు. కానీ ఆయన ఈ విధంగా వ్యవహరించారని మండిపడ్డారు. దీంతో, ఇక మహేష్ కు పార్టీ పరంగా అవకాశాలు కష్టమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
తిరుపతి ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పుట్టా మహేశ్ కుమార్ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. యువకుడు.. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారని అతడికి అవకాశమిచ్చామని వివరించారు. కానీ ఆయన ఈ విధంగా వ్యవహరించారన్నారు. అసలు ఆ పార్టీలకు వెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందంటూ ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

గతంలో క్రమశిక్షణ ఉల్లంఘించిన వాళ్లు ఎంతటి పెద్ద వాళ్లైనా ఉపేక్షించకుండా చర్యలు తీసుకున్నానని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. క్రమశిక్షణ, విలువలు పాటించకుండా రాజకీయం చేయాలనుకోవడం కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. టీడీపీలో నాయకులంతా క్రమశిక్షణతో మెలగాల్సిందేనని.. ఎవరికీ వెసులుబాటు ఉండదని ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
పార్టీ నేతలకు చంద్రబాబు క్లారిటీ
గతంలో క్రమశిక్షణ ఉల్లంఘించిన వారు ఎంతటి పెద్ద వాళ్లైనా ఉపేక్షించకుండా చర్యలు తీసుకున్నానన్న సీఎం, విలువలు పాటించకుండా రాజకీయం చేయాలనుకోవడం సరికాదని తేల్చిచెప్పారు. కాగా.. ఎమ్మెల్యేలు కార్యకర్తలకు, ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రజల్లో ఉండే నాయకుడే సుదీర్ఘ రాజకీయాలు చేయగలరని అభిప్రాయపడ్డారు.ఈ భేటిలో ఎమ్మెల్యేల పనితీరే కాకుండా వివిధ విభాగాల్లో జిల్లాల్లో అధికారుల పనితీరుపైనా నివేదికల ఆధారంగా సీఎం ప్రశ్నించినట్లు తెలిసింది.
లా అండ్ ఆర్డర్, కీ పెర్ఫామెన్స్ ఇండికేటర్ లో నియోజకవర్గాల పనితీరుపైనా రివ్యూ చేశారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు సృష్టించే నిర్ణయాలపై చర్చ జరిగింది. తక్కువ ఖర్చుతో పూర్తి చేసి అందుబాటులో తెచ్చే ప్రాజెక్టులకు వెంటనే నిధుల విడుదలు చేయాలని సీఎం ఆదేశాలిచ్చారు. ప్రజల్లో ప్రభుత్వంపై సానుకూల అభిప్రాయం పెంచేలా పనిచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
-
మావిగన్ చర్చ వేళ సీఆర్డీఏ పరిధి పై కీలక నిర్ణయం- ఇక ఇలా..!! -
వీడ్ని నడిరోడ్డుపై ఉరి తీసినా తప్పులేదు.. 180 మంది బాలికలపై..!! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!!











Click it and Unblock the Notifications