అరుదైన గౌరవం: చంద్రబాబుకు అంతర్జాతీయ అవార్డు, కాలిఫోర్నియాకు ఆహ్వానం
తెలుగుదేం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడుకు మరోసారి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. చంద్రబాబుకు ‘యూఎస్ఐబీసీ ట్రాన్ప్ఫర్మెటివ్ చీఫ్ మినిస్టర్’
అమరావతి: తెలుగుదేం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడుకు మరోసారి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. చంద్రబాబుకు 'యూఎస్ఐబీసీ ట్రాన్ప్ఫర్మెటివ్ చీఫ్ మినిస్టర్' అవార్డు అందజేయనున్నట్లు యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రకటించింది.
మే 8న అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగే కార్యక్రమంలో కీలకోపన్యాసం చేయాలని చంద్రబాబుకు ఆహ్వానం పంపారు. ఈ కార్యక్రమంలో 150కి పైగా పైగా సాంకేతిక దిగ్గజ సంస్థలు పాల్గొననున్నాయి. విభజన అనంతరం లోటు బడ్జెట్ రాష్ట్రాన్ని సమర్థవంతంగా అభివృద్ధి దిశగా నడిపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబుకు ఈ అవార్డు దక్కింది.
అసెంబ్లీలోనే ప్రమాణస్వీకారం
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి వేదిక ఖరారైంది. అసెంబ్లీ ఆవరణలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ ప్రారంభం రోజు సభ నిర్వహించిన ప్రదేశంలోనే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నుంచి సాధారణ పరిపాలన శాఖకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. ఆదివారం ఉదయం 9.25 గంటలకు కొత్త మంత్రులతో గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు.