ఆ జిల్లాలకు మహర్దశ.. కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో అన్ని రంగాల పురోగతి పైన దృష్టి సారించారు. ముఖ్యంగా ఏపీలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఏపీ పురోగతి కోసం ముఖ్యంగా పర్యాటక రంగ అభివృద్ధి కోసం పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపైన చర్చించిన అనంతరం సీఎం చంద్రబాబు తాజా రాజకీయ పరిణామాలపైన మంత్రులతో సంభాషించారు.
పర్యాటక రంగం ఒక గేమ్ చేంజర్
ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు జలరవాణాను పెంపొందించుకోవటం ద్వారా లాజిస్టిక్స్ లో ప్రపంచ స్థాయిలో పోటీ పడాలని చంద్రబాబు అన్నారు. దీనివల్ల రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని పేర్కొంటూ, అన్ని తీర ప్రాంత జిల్లాలలో ఒక్కో పోర్టు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.అంతేకాదు పర్యాటక రంగాన్ని గేమ్ చేంజర్ అని అభివర్ణించిన చంద్రబాబు చీరాలలో పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించి సూర్యలంక లో మూడు కొత్త హోటల్స్ కు ఆమోదం తెలిపారు.

ఫెర్రో అల్లాయిస్ యూనిట్లకు ఏడాది పాటు విద్యుత్ రాయితీ
రాష్ట్రంలో 70 వేల మందికి ఉపాధి కల్పిస్తున్న ఫెర్రో అల్లాయిస్ యూనిట్లకు ఏడాది పాటు విద్యుత్ రాయితీలను ప్రకటించారు. గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో విధించిన 4490 కోట్ల రూపాయల ట్రూ అప్ చార్జీల భారం ప్రజల పైన పడకుండా ప్రభుత్వమే భరిస్తుందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. యూనిట్ విద్యుత్ చార్జీని ఐదు రూపాయల 19 పైసల నుంచి నాలుగు రూపాయల 90 పైసలకు తగ్గించామని ఆయన వెల్లడించారు.
ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం
బార్లు, లిక్కర్ షాపులకు ఏ ఈ ఆర్ టి చార్జీలను సమం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సముద్రంలో వృధాగా కలిసే జలాలను తెలుగు రాష్ట్రాల సద్వినియోగం చేసుకోవాలని, నీరు వృధా కాకుండా చూసుకుంటే కొత్త పంటలకు వీలవుతుందని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వం అన్ని రకాల పంటలను కొనుగోలు చేస్తుందని, రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు కూడా ప్రోత్సహించాలని చంద్రబాబు సూచించారు.
ప్రతి ప్రాజెక్టును అధికారులు సమన్వయంతో గ్రౌండ్ చేయాలి
పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కృష్ణా జలాలను విశాఖపట్నం తీసుకు వెళ్లవచ్చని సీఎం పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆగిపోయిందని, ఇప్పుడు తమపై నిందలు వేయడం సరికాదని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రతి ప్రాజెక్టును అధికారులు సమన్వయంతో గ్రౌండ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
-
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications