ఆ 75 వేలమందికి శుభవార్త.. రెండోవిడత ఇందిరమ్మ ఇళ్ళలో వారికే తొలి ప్రాధాన్యత!

తెలంగాణలో పేదలందరికీ సొంత ఇల్లు కలలు సాకారం చేసే దిశగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతలో గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

గుడిసెలు లేని తెలంగాణను సాధించడమే లక్ష్యం

ఈ విడతలో సుమారు 75వేల మంది లబ్ధిదారులకు ప్రత్యేకంగా రూ.2లక్షల చొప్పున ఆర్థికసాయం అందించి, వారి ఇళ్ల పైకప్పును ఆర్‌సీసీ స్లాబ్‌తో బలపరచి నివాసయోగ్యం చేయనున్నారు.
రాష్ట్రంలో గుడిసెలు లేని తెలంగాణను సాధించడమే లక్ష్యంగా ఈ పథకం అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రెండో విడతలో మొత్తం 2.5లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సుమారు 2,000 ఇళ్ల చొప్పున కేటాయింపు జరుగుతుంది.

indiramma housing scheme Minister Ponguleti Srinivas Reddy announced priority for those 75k people

గృహలక్ష్మి పథకంలో అసంపూర్ణంగా ఉన్న ఇళ్ళకూ మోక్షం

గుడిసెవాసులందరికీ ఇళ్లు మంజూరు చేసిన తర్వాత మాత్రమే మిగిలిన దరఖాస్తులను పరిశీలించాలని సూచించారు. ఇది పేదల జీవితాల్లో వెలుగులు నింపే చర్యగా మారనుంది.
పాత ఇందిరమ్మ ఇళ్ల పథకం (2006-2013) కాలంలోనూ, గృహలక్ష్మి పథకం క్రింద మొదలుపెట్టిన కొన్ని ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయి. గోడలు పూర్తయి స్లాబ్ పడకుండా ఉన్న వాటికి రూ.2 లక్షలు, పునాది దశలో ఆగిపోయినవాటికి రూ.3లక్షల వరకు సాయం అందించి పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

గుడిసెల్లో ఉంటున్న వారికి మొదటి అవకాశం ఇస్తున్నామన్న పొంగులేటి

ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా క్షేత్రస్థాయి సర్వే చేసి అర్హులను గుర్తించి, పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం పేదల కష్టాలు తీర్చడానికి కట్టుబడి ఉంది. గుడిసెల్లో ఉంటున్న వారికి మొదటి అవకాశం ఇచ్చి, వారి కుటుంబాలు సురక్షితంగా జీవించేలా చూడాలి. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం వేగంగా అమలు కావాలని అధికారులను ఆదేశించారు.

రైతులకు శుభవార్త.. ఖరీఫ్ సీజన్ రైతు భరోసాకు ముహూర్తం ఖరారు!
రైతులకు శుభవార్త.. ఖరీఫ్ సీజన్ రైతు భరోసాకు ముహూర్తం ఖరారు!

సామాన్యుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా పథకం

ఈ పథకం ద్వారా సొంత స్థలం ఉన్న పేదలు, గుడిసెవాసులు, ఇతర అర్హులు ఎక్కువ మంది ప్రయోజనం పొందుతారు. మొదటి విడతలో ఇప్పటికే లక్ష ఇళ్లు పూర్తి కావడం గొప్ప విజయం. రెండో విడతతో కలిపి మొత్తం ఇళ్ల సంఖ్య భారీగా పెరుగుతుంది. రైతులు, కార్మికులు, సామాన్యుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ఈ కార్యక్రమం రూపొందించబడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+