Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ రాజ్‌భవన్ ఎట్ హోం.. చంద్రబాబు, పవన్ హాజరు, రఘురామ ముచ్చట

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ రాజ్‌భవన్‌లో 'ఎట్ హోం' కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ టీ పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి సహా పలువురు మంతరులు, ప్రముఖులు హాజరయ్యారు.

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, హైకోర్టు న్యాయమూర్తులు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, నారాయణ, పార్థసారథి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, సవిత, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీఎస్, డీజీపీ, ఇతర సీనియర్ అధికారులు, రాజకీయ పార్టీల నేతలు కార్యక్రమానికి హాజరయ్యారు.

CM Chandrababu Naidu and Deputy CM Pawan Kalyan attend AP Raj Bhavan at Home program

ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు పలు అంశాలపై కొద్దిసేపు చర్చించుకున్నారు. 76వ గణతంత్ర దినోత్సవానికి రాజభవన్ ప్రాంగణాన్ని పూలు, విద్యుత్ దీపాలంకరణ‌తో అందంగా అలంకరించారు. కాగా, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు సీఎం చంద్రబాబుతో కొద్దిసేపు చర్చించారు. సీఎం చంద్రబాబు దంపతులు, గవర్నర్ అబ్దుల్ నజీర్, హైకోర్టు సీజే, పవన్ కల్యాణ్ ఒకే చోట కూర్చుని ఆతిథ్యాన్ని స్వీకరించారు.

మరోవైపు, క్రీడాకారులు మంత్రి నారా లోకేష్‌​తో కొద్దిసేపు మాట్లాడారు. ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకటరావు, గద్దె రామ్మోహన్, శ్రీరామ్ తాతయ్య, మండలి బుద్ధ ప్రసాద్, వర్ల కుమార్ రాజా, ప్రజా ప్రతినిధులు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, సీపీఐ రామకృష్ణ, వివిధ పార్టీల ముఖ్యనేతలు, క్రీడాకారులు అథ్లెట్ వై.జ్యోతి, కోనేరు హంపి తదితరులు హాజరయ్యారు. సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమైన ఎట్ హోం కార్యక్రమం గంటన్నరపాటు కొనసాగింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+