బాబా రాందేవ్ కు చంద్రబాబు కీలక పదవి ఆఫర్..!!
ప్రముఖ యోగా గురువు బాబా రామ్ దేవ్ కు సీఎం చంద్రబాబు కీలక పదవి ఆఫర్ చేసారు. రాష్ట్రం లో పర్యాటకం అభివృద్ధి చెందేందుకు అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు. భవిష్యత్తు అంతా పర్యాటకరంగానిదే అని తాను ఎప్పుడో చెప్పానన్నారు. అందరూ హెల్తీ, వెల్తీ, హ్యాపీగా ఉండాల నేది తన లక్ష్యమని ముఖ్యమంత్రి వెల్లడించారు. పర్యాటకరంగంలో అనేక ఉద్యోగాలు వస్తాయని, రాష్ట్రంలో వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని బాబా రామ్దేవ్ను కోరారు.
రాం దేవ్ బాబాకు ఆఫర్
జీఎఫ్ఎస్టీ టూరిజం కాంక్లేవ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్తో కలిసి పర్యటక క్యారవాన్లను సీఎం ప్రారంభించారు. టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయని యువత భయపడుతున్నారని కానీ నైపుణ్యం పెంచుకుని స్మార్ట్ వర్క్ చేస్తే ఉద్యోగాలు ఎక్కడికీ పోవని చంద్రబాబు చెప్పారు. యోగా డే నిర్వహణలో గిన్నిస్ రికార్డు సాధించామని గుర్తు చేశారు. ఆధ్యాత్మికవేత్తగా ఉన్నా బాబా రామ్దేవ్ సమాజానికి సేవ చేస్తున్నారని, పర్యాటకశాఖకు సలహాదారుగా ఉండాలని చంద్రబాబు కోరారు. ఆగస్టు 15లోగా అన్ని సేవలనూ ఆన్లైన్లోనే అందిస్తామని వెల్లడించారు. పర్యాటకరంగంలో అనేక ఉద్యోగాలు వస్తాయని చెప్పుకొచ్చారు.

గేమ్ ఛేంజర్
రాష్ట్రంలో వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని బాబా రామ్దేవ్ను సీఎం చంద్రబాబు కోరారు. యోగా, మెడిటేషన్ గేమ్ ఛేంజర్ కానున్నాయన్న సీఎం, అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే సేంద్రీ య సాగు ఎక్కువ చేస్తున్నామని గుర్తు చేశారు. టెంపుల్ టూరిజం మరింత అభివృద్ధి కావాలని, మన రాష్ట్రానికి అద్భుతమైన సముద్ర తీరం ఉందని పేర్కొన్నారు. మన రాష్ట్రంలో అనేకచోట్ల అందమైన అటవీ ప్రాంతం ఉందని, పాపికొండలు, కోనసీమ, హార్సిలీహిల్స్ను మరింత అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు.విదేశాల్లో ఉన్న భారతీయుల్లో 35 శాతం తెలుగువాళ్లే అని పేర్కొన్నారు. విదేశాల్లో ఎక్కువ ఆదాయం పొందుతున్నదీ తెలుగువాళ్లేనన్నారు. బకింగ్హామ్ కాలువ ద్వారా కాకినాడ-చెన్నై మధ్య వాణిజ్యం జరిగేదని గుర్తు చేశారు.
స్మార్ట్ వర్క్ చేయాలి
టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయని యువత భయపడుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానిం చారు. నైపుణ్యం పెంచుకుని స్మార్ట్ వర్క్ చేస్తే ఉద్యోగాలు ఎక్కడికీ పోవని, దేశంలోనే ప్రముఖ టూరిస్ట్ హబ్గా ఏపీ మారాలని కోరుకుంటున్నామని చెప్పారు. పర్యాటకరంగం అభివృద్ధిపై ఏటా సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. బాబా రామ్దేవ్ స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని కొనియాడారు. దేశంలో 1991 తర్వాత పీవీ ఆర్థిక సంస్కరణలు తెచ్చారని, తర్వాత మనదేశంలో ఐటీ బాగా అభివృద్ధి చెందిందని చంద్రబాబు గుర్తు చేసారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications