ఎపిలో ఏం చేస్తున్నామంటే?....:వరల్డ్ సిటీ సమ్మిట్లో సీఎం చంద్రబాబు ప్రసంగం
సింగపూర్:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన బిజీబిజీగా సాగుతోంది. తొలిరోజు ఆ దేశపు మంత్రి మంత్రి వోంగ్ లోతో భేటీలో పాల్గొన్న చంద్రబాబు రెండో రోజు పర్యటనలో భాగంగా ప్రపంచ నగరాల సదస్సు ప్లీనరీలో పాల్గొన్నారు.
Recommended Video

చంద్రబాబుతో భారత రాయబారి భేటీ
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి సాధనాల ద్వారా నీటి వనరులు, ఉష్ణోగ్రతలు, గాలి నాణ్యత సమాచారాన్నితెలుసుకోవచ్చని చెప్పారు. అలాగే సమర్థ నిర్వహణ పద్ధతుల ద్వారా రాష్ట్రంలో భూగర్భజలాలను పెంచగలిగామని తెలిపారు. నదుల అనుసంధానం, భూగర్భ జలాల పునర్ వినియోగం, వ్యర్థ నీటి నిర్వహణ చర్యలతో మెరుగైన ఫలితాలు సాధించామని వెల్లడించారు.

పునరుత్పాదక ఇంధనంపై ప్రధానంగా దృష్టి సారించామని చంద్రబాబు చెప్పారు. 5 లక్షల మంది రైతుల భాగస్వామ్యంతో జీరో బేస్డ్ నాచురల్ ఫార్మింగ్ వైపు వెళ్తున్నామని తెలిపారు .అలాగే ద్రవ, ఘన వ్యర్ధాల నిర్వహణను సమర్థమైన పద్ధతుల్లో చేపడుతున్నామని చంద్రబాబు వివరించారు. హరిత రాజధాని అమరావతిలో సాంకేతిక పద్దతులను వినియోగిస్తున్నామని...రాజధాని నగరం పరిధిలో 5-10-15 అభివృద్ధి విధానాన్ని అనుసరిస్తున్నామని తెలిపారు.
అత్యవసర గమ్యాలను చేరుకోవడానికి 5 నిమిషాలు..సామాజిక అవసరాలకు 10... కార్యక్షేత్రానికి చేరుకోవడానికి 15 నిమిషాలు అనే కాన్సెప్ట్ అమలు చేస్తామని సిఎం చంద్రబాబు ఈ సమావేశంలో వివరించారు.
More From
-
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..!












Click it and Unblock the Notifications