చంద్రబాబు కొత్త థీమ్ ఆవిష్కరణ..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీకి పెట్టుబడుల ఆకర్షణ పైన ఫోకస్ చేసారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెట్టబడులు - ఉపాధి కల్పన పైన కసరత్తు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా పలువురితో చంద్రబాబు టీం సంప్రదింపులు కొనసాగిస్తోంది. ఇక, ప్రతీ ఏటా స్విట్జర్లాండ్ దావోస్ లో జరిగి ప్రపంచ ఆర్దిక సదస్సుకు చంద్రబాబు హాజరు కానున్నారు. అక్కడ సరి కొత్త థీమ్ ఆవిష్కరణకు చంద్రబాబు సిద్దమయ్యారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం ఈ నెల 20వ తేదీ నుంచి 4 రోజుల పాటు దావోస్ లో పర్య టించనుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 సదస్సుకు సీఎం నేతృత్వంలోని బృందం హాజరు కానుంది. 2014-19 కాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ దావోస్ లో ఈ సదస్సులకు హాజరయ్యారు. జగన్ సీఎం అయిన తరువాత ఒక ఏడాది మాత్రమే వెళ్లారు. ఇక, ఇప్పుడు చంద్రబాబు కేబినెట్ లోని మంత్రులతో పాటుగా అధికారులతో కలిసిన టీం దావోస్ వెళ్లేందుకు సిద్దమైంది. జనవరి 20 నుంచి 24వ తేదీ వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరగనుంది.

ఏపీ నుంచి సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ , పరిశ్రమలు, ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అధికారులు కూడా దావోస్ సదస్సుకు హాజరు కానున్నారు. రాష్ట్రంలోని వనరులు, పెట్టుబడి అవకాశాలను ప్రపంచ ఆర్ధిక సదస్సులో వివరించనున్నారు. 'షేపింగ్ ద ఇంటెలిజెంట్ ఏజ్' అనే థీమ్ తో ఈ సారి దావోస్ లో ప్రదర్శన ఏర్పాటు చేయనుంది. వరల్డ్ ఎకనామిక్ సదస్సులో జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసే స్టాల్తో పాటు రాష్ట్రానికి ప్రత్యేకంగా ఓ స్టాల్ను కేంద్రం రిజర్వు చేసింది.
రాష్ట్రంలో సాంకేతిక పాలన, పునరుత్పా దక విద్యుత్ ఉత్పత్తి, స్మార్ట్ సిటీస్, మౌలిక సదుపాయా ల కల్పన ప్రాజెక్టులతో పాటుగా రాష్ట్రంలో ఉన్న అవకాశాలను ఈ సదస్సులో వివరించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక దగ్గజాలు దావోస్ కు రానున్నారు. వారితో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం అయ్యేలా సమయం కోరారు. ఇదే సదస్సు ద్వారాలో ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు.. మౌళిక వసతులు.. పారిశ్రామిక పాలసీ గురించి వివరించి పెట్టు బడులను ఆకర్షించే ప్రయత్నం చేయనున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ!











Click it and Unblock the Notifications