Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ ఆపరేషన్ 2024 - 11 స్థానాల్లో అభ్యర్దుల ఖరారు, 3 మంత్రుల స్థానాలు మార్పు..!!

ముఖ్యమంత్రి జగన్ ఆపరేషన్ 2024 ప్రారంభించారు. వై నాట్ 175 లక్ష్యం కోసం సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గెలుపే ప్రామాణికంగా అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా సీఎంకు సన్నిహితుడైన ఆర్కే ను మార్చారు. లోకేశ్..పవన్ కల్యాణ్ పైన గత ఎన్నికల్లో విజయం సాధించిన ఇద్దరినీ పక్కన పెట్టారు. ముగ్గురు మంత్రుల స్థాన చలనంతో సమా 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జ్ లను ప్రకటించారు.

జగన్ కొత్త లెక్కలు: ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల నిర్ణయాలు మొదలు పెట్టారు. సామాజిక - ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటే గెలుపు మాత్రమే ప్రాతిపదికగా అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. ముందుగా నియోజకవర్గ ఇంఛార్జ్ లుగా వారిని నియమించారు. నియోజకవర్గాల్లో అభ్యర్దుల మార్పులో భాగంగా తొలి జాబితాల లో 11 నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జ్ లను ప్రకటించారు.

CM Jagan begins operation 2024, Changes 11 Assembly incharges including two ministers

మంత్రి విడదల రజనీ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరి పేట నుంచి గుంటూరు పశ్చిమం కు మార్చారు. చిలకలూరిపేటలో మల్లెల రాజేష్ నాయుడు అనే కొత్త అభ్యర్దికి బాధ్యతలు అప్పగించారు. మరో మంత్రి ఆదిమూలపు సురేష్ ను కొండెపికి మార్పు చేసారు. అక్కడ ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

అభ్యర్దుల ఖరారు: మరో మంత్రి మేరుగ నాగార్జునను వేమూరు నుంచి మార్చి ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఇంఛార్జ్ గా ప్రకటించారు. మాజీ హోం మంత్రి సుచరిత ను ప్రత్తిపాడు నుంచి మార్చి పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఉండవల్లి శ్రీదేవి నియోజకవర్గం తాడికొండ ఇంఛార్జ్ గా ఖరారు చేసారు. ప్రత్తిపాడు లో వైసీపీ కొత్త ఇంఛార్జ్ బాలసాని కిరణ్ కుమార్ ను నియమించారు.

వేమూరు నియోకవర్గంలో వరికూటి అశోక్ బాబుకు బాధ్యతలు అప్పగించారు. అద్దంకి బాద్యతలు పాణెం హనిమి రెడ్డికి కేటాయించారు. మంగళగిరిలో ఆర్కే స్థానం గంజి చిరంజీవికి బాధ్యతలు అప్పగించారు. అక్కడ టీడీపీ నేత నారా లోకేశ్ పైన వచ్చే ఎన్నికల్లో గంజి చిరంజీవి పోటీ చేయనున్నారు.

CM Jagan begins operation 2024, Changes 11 Assembly incharges including two ministers

గెలుపే ప్రామాణికం: ఇక, రేపల్లె నుంచి టీడీపీలో మంత్రిగా పని చేసిన ఈపూరు సీతారావమ్మ కుమారుడు డాక్టర్ ఈపూరు గణేష్ ను ఇంఛార్జ్ గా నియమించారు. ఇక..2009 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పైన గాజువాక నుంచి గెలిచిన తిప్పారెడ్డి స్థానంలో వరికూటా రామచంద్రరావును సీఎం జగన్ ఖరారు చేసారు. కొద్ది రోజులుగా పలు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్దుల మార్పు ఖాయమనే ప్రచారం సాగింది.

తెలంగాణ ఎన్నికల తరువాత సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు పైన చర్చ మోదలైంది. దీంతో..జగన్ అటు టీడీపీ - జనసేన పొత్తు ఖాయం కావటంతో ప్రతీ సీటు పైన అన్ని కోణాల్లోనూ సమాచారం సేకరిస్తున్నారు. అన్నీ సమీకరణాలను పరిగణలోకి తీసుకొని ఈ 11 నియోజకవర్గాల్లో పార్టీ ఇంఛార్జ్ లను ప్రకటించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+